Tragedy : మంచిర్యాలలో ఘోరం.. రూ.100 ఇవ్వలేదని ప్రాణం తీసిన దుండగుడు.!
- రూ.100 కోసం ఘోర దాడి
- దంపతులపై ఇనుప రాడ్తో దాడి
- చికిత్సలో భర్త మృతి
- నిందితుడి కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేవలం వంద రూపాయల కోసం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొన్న దారుణ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఒక కిరాతకుడు భార్యాభర్తలపై ఇనుప రాడ్తో విచక్షణారహితంగా దాడి చేయగా, తీవ్ర గాయాలైన భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బిళ్ల శంకరయ్య, అతని భార్య నివసిస్తున్న ప్రాంతంలోనే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సదరు నిందితుడు శంకరయ్య దగ్గరకు వచ్చి వంద రూపాయలు అడిగాడు. అయితే, తన వద్ద డబ్బులు లేవని శంకరయ్య చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ చిన్న విషయానికే తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ దుండగుడు, వెంటనే ఒక ఇనుప రాడ్ను తీసుకొచ్చి శంకరయ్యపై దాడికి దిగాడు.
CM Chandrababu: అర్థమైందా రాజా..? రజనీకాంత్ డైలాగ్ చంద్రబాబు నోట..
Also Read
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
- Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
- OTR : కాంగ్రెస్ నేతల పొలాల్లో మొలకలు వస్తున్నాయా?
- Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
భర్తపై దాడి జరుగుతుండటం చూసి తట్టుకోలేకపోయిన శంకరయ్య భార్య, అతడిని కాపాడుకోవడానికి అడ్డువెళ్లింది. అయితే, మానవత్వం మరచిన ఆ నిందితుడు ఆమెను కూడా వదలకుండా రాడ్తో బాదాడు. ఈ దాడిలో దంపతులిద్దరూ తీవ్ర రక్తగాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన బిళ్ల శంకరయ్య, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఆయన భార్య ప్రస్తుతం తీవ్ర గాయాలతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ముత్యంపేట గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చిన్న కారణానికే ప్రాణం తీయడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!