Tragedy : మంచిర్యాలలో ఘోరం.. రూ.100 ఇవ్వలేదని ప్రాణం తీసిన దుండగుడు.!
- రూ.100 కోసం ఘోర దాడి
- దంపతులపై ఇనుప రాడ్తో దాడి
- చికిత్సలో భర్త మృతి
- నిందితుడి కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేవలం వంద రూపాయల కోసం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొన్న దారుణ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఒక కిరాతకుడు భార్యాభర్తలపై ఇనుప రాడ్తో విచక్షణారహితంగా దాడి చేయగా, తీవ్ర గాయాలైన భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బిళ్ల శంకరయ్య, అతని భార్య నివసిస్తున్న ప్రాంతంలోనే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సదరు నిందితుడు శంకరయ్య దగ్గరకు వచ్చి వంద రూపాయలు అడిగాడు. అయితే, తన వద్ద డబ్బులు లేవని శంకరయ్య చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ చిన్న విషయానికే తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ దుండగుడు, వెంటనే ఒక ఇనుప రాడ్ను తీసుకొచ్చి శంకరయ్యపై దాడికి దిగాడు.
CM Chandrababu: అర్థమైందా రాజా..? రజనీకాంత్ డైలాగ్ చంద్రబాబు నోట..
Also Read
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
- CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
- Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
భర్తపై దాడి జరుగుతుండటం చూసి తట్టుకోలేకపోయిన శంకరయ్య భార్య, అతడిని కాపాడుకోవడానికి అడ్డువెళ్లింది. అయితే, మానవత్వం మరచిన ఆ నిందితుడు ఆమెను కూడా వదలకుండా రాడ్తో బాదాడు. ఈ దాడిలో దంపతులిద్దరూ తీవ్ర రక్తగాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన బిళ్ల శంకరయ్య, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఆయన భార్య ప్రస్తుతం తీవ్ర గాయాలతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ముత్యంపేట గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చిన్న కారణానికే ప్రాణం తీయడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
-
Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
-
Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
-
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
-
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?