Nizamabad : నిజామాబాద్ లో.. రోడ్డు ప్రమాదం.. చిన్నారితో పాటు ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జిల్లాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడుపడంతో జరుగుతున్న ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 99 రోడ్డు ప్రమాదాలు సంభవించగా సుమారు 120 మంది వరకు మృతిచెందారు. మరో 255 మంది క్షతగాత్రులయ్యారు.
కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మరువకముందే .. అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెలుతున్న నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుంది. మృతులు కమ్మర్ పల్లి ఇందిరాకాలనీకి చెందిన వాసులుగా గుర్తించారు.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
వివరాల్లోకి వెళితే..కృష్ణ, రజిత దంపతులకు రాగిని, శరణ్య ఇద్దరి పిల్లలు. వీరు కమ్మర్ పల్లి మండలంలోని ఇందిరాకాలనీలో నివాశం వుంటున్నారు. నిన్న అర్ధరాత్రి పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెలుతుండగా .. గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో.. బైక్ పై వెళుతున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తల్లిదండ్రులు కృష్ణ, రజితతో పాటు, పెద్దకూతురు రాగిని కూడా మృతుల్లో వున్నారు. చిన్న కూతురు శరణ్య పరిస్థితి విషమంగా వుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఢీకొట్టి వెళ్ళిన గుర్తు తెలియని వాహనంకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నిన్న మంచిర్యాల జిల్లా వాంకిడి-ఆసిఫాబాద్ ప్రధాన రహదారి కమాన చౌరస్తా వద్ద ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు తిర్యాణికి చెందిన మర్సుకోల శంకర్ గా గుర్తించారు పోలీసులు. మర్సుకోల సుమన్, వాంకిడికి చెందిన బంక రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది మృత్యువాత పడ్డారు. ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి గేట్ వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఇందులో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎల్లారెడ్డి నుంచి పిట్లం నుంచి ట్రాలీ ఆటో వెలుతుండగా.. అదే సమయంలో పిట్లం నుంచి నిజాంసాగర్ వైపు లారీ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చిన ట్రాలీ ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 26 మంది ఉన్నారు.
Sri Lanka: విపక్ష నేత సజిత్ ప్రేమదాసపై దాడి….విషమించిన పరిస్థితులు
తాజావార్తలు
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!