Nizamabad : నిజామాబాద్ లో.. రోడ్డు ప్రమాదం.. చిన్నారితో పాటు ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జిల్లాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడుపడంతో జరుగుతున్న ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 99 రోడ్డు ప్రమాదాలు సంభవించగా సుమారు 120 మంది వరకు మృతిచెందారు. మరో 255 మంది క్షతగాత్రులయ్యారు.
కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మరువకముందే .. అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెలుతున్న నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుంది. మృతులు కమ్మర్ పల్లి ఇందిరాకాలనీకి చెందిన వాసులుగా గుర్తించారు.
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
వివరాల్లోకి వెళితే..కృష్ణ, రజిత దంపతులకు రాగిని, శరణ్య ఇద్దరి పిల్లలు. వీరు కమ్మర్ పల్లి మండలంలోని ఇందిరాకాలనీలో నివాశం వుంటున్నారు. నిన్న అర్ధరాత్రి పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెలుతుండగా .. గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో.. బైక్ పై వెళుతున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తల్లిదండ్రులు కృష్ణ, రజితతో పాటు, పెద్దకూతురు రాగిని కూడా మృతుల్లో వున్నారు. చిన్న కూతురు శరణ్య పరిస్థితి విషమంగా వుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఢీకొట్టి వెళ్ళిన గుర్తు తెలియని వాహనంకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నిన్న మంచిర్యాల జిల్లా వాంకిడి-ఆసిఫాబాద్ ప్రధాన రహదారి కమాన చౌరస్తా వద్ద ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు తిర్యాణికి చెందిన మర్సుకోల శంకర్ గా గుర్తించారు పోలీసులు. మర్సుకోల సుమన్, వాంకిడికి చెందిన బంక రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది మృత్యువాత పడ్డారు. ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి గేట్ వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఇందులో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎల్లారెడ్డి నుంచి పిట్లం నుంచి ట్రాలీ ఆటో వెలుతుండగా.. అదే సమయంలో పిట్లం నుంచి నిజాంసాగర్ వైపు లారీ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చిన ట్రాలీ ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 26 మంది ఉన్నారు.
Sri Lanka: విపక్ష నేత సజిత్ ప్రేమదాసపై దాడి….విషమించిన పరిస్థితులు
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!