Dead Man Alive: రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు..! మార్చురీలో లేచాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dead Man Alive: చినిపోయాడని భావించిన వ్యక్తులు చివరి నిమిషంలో అనూహ్యంగా బతికిన ఘటనలు చాలానే ఉన్నాయి.. కొందరు అంతిమయాత్రలో లేచికూర్చుంటే.. మరికొందరు చనిపోయారని వదిలేసిన తర్వాత.. వారికి కదలికలను గుర్తించి సందర్భాలు కూడా ఉన్నాయి.. తాజా, నిజమాబాద్ మార్చురీ లో వింత ఘటన వెలుగు చూసింది.. చనిపోయాడని మార్చురికి తెచ్చిన ఓ వ్యక్తిలో అనూహ్యంగా కదలికలు వచ్చాయి.. దీంతో, హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
Read Also: CM YS Jagan: సీఎం జగన్ కీలక భేటీ.. మారబోతున్న ఎమ్మెల్యేల జాతకాలు..!
Also Read
చనిపోయిన వ్యక్తి మళ్లీ బతకడం ఏంటి? మార్చురీ అంటేనే శవాలను భద్రపరచడానికే.. పోస్టుమార్టం నిర్వహించడానికో తరలిస్తారు.. అక్కడ చనిపోయిన వ్యక్తి లేవడం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా తిర్మన్పల్లికి చెందిన అబ్దుల్ గఫర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.. అయితే, నిజామాబాద్ నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆయన మృతిచెందినట్టు చెప్పారు.. దీంతో, మార్గమద్యలోనే మృతిచెందాడని భావించి.. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.. అక్కడే అంతా షాక్ తిన్నారు.. ఆస్పత్రికి తరలించే క్రమంలో అబ్దుల్ నోట్లో పెట్టిన పైపులను తొలగించారు ఆస్పత్రి సిబ్బంది.. అదే సమయరంలో అబ్దుల్ గఫర్లో కదలికలను గుర్తించారు.. దీంతో షాక్ తిన్న సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.. హుటాహుటిన మళ్లీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు తెలియాల్సి ఉన్నా.. చనిపోయాడని భావించిన వ్యక్తిలో కదలికలను గుర్తించి అంతా షాక్కు గురయ్యారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
-
PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!