Site icon NTV Telugu

ఖమ్మంలో పెండింగ్ సమస్యలపై సీఎల్పీనేత భట్టి ఫోకస్…

సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్నారు. మధిర నుంచి మొదలుకొని.. జిల్లా అంతటా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలపై గళం విప్పేందుకు యాత్రకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఖమ్మం జిల్లా పెండింగ్ సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. తన సొంత నియోజకవర్గం మధిరలో పెద్దసంఖ్యలో రైతుకుటుంబాలున్నాయి. ఇప్పుడు ఆ రైతుల సమస్యల పరిష్కారం కోసం.. గ్రామ గ్రామాన పర్యటన చేయాలని నిర్ణయించారు భట్టి. మధిర నియోజక వర్గంలోని ముదిగొండ నుండి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడి నుండి నియోజకవర్గం లో గ్రామలన్నిటిని టచ్ చేస్తూ యాత్ర కు ప్లాన్ చేస్తున్నారు.

జనవరి 9 నుండి సిఎల్పీ నేత భట్టి పాదయాత్ర ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. దీనికి రూట్ మ్యాప్ సిద్దం చేస్తోంది భట్టి టీం. ముదిగొండ నుండి… నిత్యం 10 నుండి 15 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్ తయారు చేస్తున్నారు. నియోజకవర్గం లో పాదయాత్ర పూర్తవ్వగానే… జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర కు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల mlc ఎన్నికల్లో పార్టీ కి కొంత జోష్ వచ్చింది. దీన్ని కంటిన్యూ చేయడం కోసం జిల్లా అంతటా పాదయాత్ర చేయాలని చూస్తున్నారు భట్టి. రైతుల సమస్యలను పాదయాత్రలో ఫోకస్ చేయాలని భావిస్తున్నారు.

భట్టి పాదయాత్ర షెడ్యూల్ జనవరి మొదటి వారంలో ఖరారు కానుంది. ముదిగొండ నుండి మొదలై ఖమ్మం లో ముగించేలా ప్లాన్ చేస్తున్నారు భట్టి.

Exit mobile version