Malla Reddy: వాళ్లను జైలుకి పంపించే బాధ్యత నాదే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malla Reddy: మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా దొంగ, ఇద్దరు దొంగలు తయారు అయ్యారని, భూకబ్జా దారులంటూ..వాళ్లను జైల్ కి పంపించే బాధ్యత నాదే అని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బోడుప్పల్ లో బిఅరెస్ పార్టీ కార్యాలయాన్ని మల్లారెడ్డి ప్రారభించారు. బీఆర్ఎస్ పార్టీ అంటే చరిత్ర అని అన్నారు. సీఎంగా కేసీఆర్ అయ్యాకనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకున్నారు. కొత్తగా 10 పథకాలు కేసీఆర్ తిసుకువచ్చారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పధకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. కాంగ్రెస్ అంటే మోసం, దగా పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి జంగయ్య దొంగల ముఠా నాయకుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా దొంగ, ఇద్దరు దొంగలు తయారు అయ్యారు.. భూకబ్జా దారులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లను జైల్ కి పంపించే బాధ్యత నాదే అన్నారు. దళితులకు భూములను పంచె బాధ్యత నాదే అంటూ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే వెస్ట్ అవుతుందని తెలిపారు. ఇక్కడ ఎంపీ ఎవరికి తెలియదన్నారు. పీసీసి అయ్యి సీట్లు అమ్ముకున్నాడని మండిపడ్డారు. రేవంత్ ఏ మోహం పెట్టుకొని ఇక్కడకు వస్తారు? అని ప్రశ్నించారు. పగటి వేశగాళ్ళు..వాళ్లని నమ్మవొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్ఫ్ బోర్డ్ భూముల విషయం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లామని తెలిపారు. రేవంత్, సుధీర్ రెడ్డి, జంగయ్యని తరమి కొట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీలకు వలసలు బాగా పెరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందాయని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని మూడోసారి కెసిఆర్ సీఎం కావడం పక్కా అని జోష్యం చెప్పారు. పార్టీలో చేరిన యువకులు నాయకులు రాబోయే ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గం లో నేను చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే చేయలేదని అన్నారు.
Vijayapura : కర్ణాటకలో వింత నిరసన.. కరెంట్ ఇవ్వలేదని సబ్ స్టేషన్లో మొసలిని వదిలిన రైతు
తాజావార్తలు
-
Bhogi Climax Shoot : క్లైమాక్స్ షూట్ లో “భోగి”… 20 రోజుల పాటు మెగా షెడ్యూల్
-
IMD: భారత్కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
-
APL 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం
-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
-
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!