Mahesh Kumar Goud: పాకిస్తాన్ తరహాలోనే.. టీఆర్ఎస్ నేతలు భారత్ మ్యాప్లో అది లేపేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Kumar Goud Fires On TRS Leaders Over Flexis: టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ ప్రకటన తర్వాత కూడా హైదరాబాద్లో టీఆరెస్ ప్లేక్సిలే కనిపిస్తున్నాయని చెప్పిన ఆయన.. ఆ ప్లేక్సిలో భారత్ మ్యాప్ వేశారని, అందులో జమ్ముకశ్మీర్ మ్యాప్ లేపేశారని అన్నారు. భారత్ మ్యాప్లో నుంచి జమ్ముకశ్మీర్ని లేకుండా పెట్టడం బాధాకరమని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు మన భారత మ్యాప్పై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. పాకిస్తాన్ కూడా కశ్మీర్ లేకుండా మ్యాప్ చూపిస్తుందని, అదే తరహాలో టీఆర్ఎస్ నేతలు కశ్మీర్ లేకుండా తమ ఫ్లెక్సీల్లో ఇండియా మ్యాప్ వేశారని, ఇది దేశద్రోహమే అవుతుందని అన్నారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా.. అంతకుముందు కూడా మహేష్ కుమార్ గౌడ్ తమతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ నేతలు సైతం టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కూడా తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్కు 70 స్థానాలు రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ తమ కాంగ్రెస్ పార్టీనే జెండా ఎగరేస్తుందని నమ్మకం వెలిబుచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం గంజాయి స్టేట్గా, డ్రగ్స్కు కేంద్రంగా మారిందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రం బాగు పడుతుందని, బంగారు తెలంగాణ అవుతుందని చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!