TPCC Mahesh Goud : కవితకు భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా
- కవిత కామెంట్స్పై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కవిత కూడా కీలకంగా ఉన్నారు
- కవితకు భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా.?
- పదేళ్లు ప్రజల సొమ్ము దోచుకుని ఇప్పుడు వాటాలో తేడా వచ్చి బయటపడ్డారు
- కవిత ఆధారాలు ఇస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం
- వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ముఖచిత్రం ఉండదు. -మహేష్ కుమార్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : కవిత రాజీనామాపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అబద్ధాలు మాత్రమే మాట్లాడారని ఆయన అన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో కీలక స్థానంలో ఉన్న కవితకు అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం లేకుండా అవి జరిగాయని అనటం అసాధ్యమని విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకున్న తర్వాత, వాటాలో తేడా రావడంతోనే కవిత బహిరంగ వేదికపైకి వచ్చారని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.
Nandigama : రూ.3.10 కోట్లు నోట్లతో అలంకరించిన గణపతి విగ్రహం
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
కవిత నిజంగా అవినీతి విషయాల్లో ఆధారాలు ఇస్తే వాటిని పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని PCC చీఫ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా లిక్కర్ మార్ట్ కేసు, ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రిపై ఎత్తేసిన కేసు వంటి అంశాలపై సరైన వివరాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్పై స్పై చేయాల్సిన అవసరం లేదన్నారు. “స్పై చేయడం మాకు అలవాటు కాదు.. ఫోన్ ట్యాప్లు మీరు చేశారు. మీరు మీలో మీరే గొడవ పడి బయటపడుతున్నారు” అంటూ బీఆర్ఎస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. ఆయన కవిత ఇటీవలే అమెరికా నుండి తిరిగివచ్చిన తర్వాత హరీష్ రావు, సంతోష్పై ఆరోపణలు చేయడం, అంతకు ముందు కేటీఆర్పై విమర్శలు చేయడం బీఆర్ఎస్ లోపల విభేదాలను బహిర్గతం చేస్తోందని అన్నారు.
కవిత రాజీనామా చేయడాన్ని మహేష్ గౌడ్ స్వాగతించారు. నైతికతకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడం శుభపరిణామమని అన్నారు. “కవిత కేసీఆర్ వదిలిన బాణం మాత్రమే. ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. అయితే నైతికతతో తీసుకున్న ఈ నిర్ణయం సానుకూలమే” అని వ్యాఖ్యానించారు. అంతేకాక, రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అనే పార్టీ రాజకీయ ముఖచిత్రంలో ఉండదని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. కవిత, కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
తాజావార్తలు
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!