Husband selfie video: నీ పైన నాకు ప్రేమ ఉంది.. భర్త సెల్ఫీ వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband selfie video: భార్య కాపురానికి రావడం లేదని భర్త పురుగుల మందు డబ్బాతో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెందాడు. అత్తింటికి వెళ్లి పిలిస్తే వారు దూషించడంతో తీవ్ర మనస్థాపన గురైన అశోక్ అనే వ్యక్తి తన భార్యను ఉద్దేశించి సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీ పైన నాకు ప్రేమ ఉంది.. నా పైన నీకు ప్రేమ ఉంటే చచ్చేముందన్నా రావాలంటూ సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంక్యా తండాలో చోటుచేసుకుంది.
Read also: Allu Arjun: ‘ఆదిపురుష్’తో బన్నీ బిజినెస్…
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
మహబూబాబాద్ మండలంలోని ముత్యాలమ్మ తండాకు చెందిన బేబీని ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు బేబీ గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్ళింది నాలుగు నెలల క్రితం కొడుకు పుట్టాడు. అయితే అంతకు ముందు నుంచే భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భార్యను కాపురానికి తీసుకురావడం కోసం ఐదు రోజుల క్రితం అశోకు తన అత్తగారింటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లిన అశోక్ ను భార్య బేబీ కుటుంబ సభ్యులు కలిసి దూషించారు. నానా మాటలు అని తన కూతురు అత్తింటికి పంపే ప్రశక్తే లేదని చెప్పారు. దీంతో అశోక్ అత్తింటి నుంచి బయటకు వచ్చి భార్యను చూసిన బేబీ తన వైపుకూడా చూడలేదు. ఇక చేసేది ఏమీలేక అశోక్ తన ఇంటికి వెనుతిరిగాడు.
ఇంటికి వచ్చిన అశోక్ పురుగుల మందు డబ్బాతో సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డడు. అశోక్ ను గుర్తించిన స్థానికులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అశోక్ పరిస్థితి విషమించడంతో వరంగల్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. అయితే అశోక్ తల్లిదండ్రులు తన కొడుకు చావుకు కారణం తన అత్త కుటుంబ సభ్యులు అని ఆరోపించారు. ఈ విషయమై మృతుడు తండ్రి రాములు పోలీసులకు పిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు భార్యతో పాటు అత్తమామనుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు పెద్దదిక్కుగా వున్న కొడుకు అశోక్ కుటుంబానికి దూరం కావడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులను ఓదార్చడానికి ఎవరితరం కాలేదు.
Artificial Intelligence : ఏఐతో భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు.. ఆది నుంచే నియంత్రించాలంటున్న మేధావులు
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!