Yadadri: నేను ఆత్మహత్య చేసుకుంటా ప్లీజ్ అనుమతివ్వండి.. కలెక్టర్కు మాజీ ఉద్యోగి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri: ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ మాజీ ఉద్యోగి కలెక్టర్ను కోరారు. యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ బ్రేక్ ఇన్స్పెక్టర్ సయ్యద్ నూరిళ్ల ఇటీవల కలెక్టర్ను కలిశారు. ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సయ్యద్ నూరిల్లా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కారణాలను కూడా కలెక్టర్కు వివరించారు. సయ్యద్ నూరిళ్ల ఆర్టీసీ ఉద్యోగంలో ఉన్న సమయంలో వచ్చిన జీతం డబ్బులతో గ్రామంలో ఏడెకరాల పొలం కొన్నాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉండగా.. కొన్ని నెలల క్రితం భార్య ఆకస్మికంగా మృతి చెందింది. దీంతో తండ్రి పేరిట ఉన్న ఆస్తిపై చిన్నారి కన్ను పడింది. ఆస్తి తమ పేరు మీద రాయాలని కొంతకాలంగా తండ్రిపై పిల్లలు ఒత్తిడి తెస్తున్నారు. అయితే తహసీల్దార్కు తెలియకుండా రాత్రికి రాత్రే వేరొకరి పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సయ్యద్ నైరిల్లా ఆరోపిస్తున్నారు.
Read also: Cleaning Silk Sarees: ఇంట్లోనే పట్టుచీరల క్లీనింగ్కు 5 చిట్కాలు
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
ఎమ్మార్వో తీరుపై బాధితులు కలెక్టర్కు పలుమార్లు వినతిపత్రం అందించినట్లు తెలుస్తోంది. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని, తన భూమిని తిరిగి ఇప్పించాలని కలెక్టర్కు పలుమార్లు విన్నవించారు. అయితే కలెక్టర్ కూడా తన సమస్యను పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో చావుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ పిటిషన్లో ఆయన తన సమస్యను మరోసారి వివరించారు. ఎమ్మార్వో కావాలనే రాత్రి 9 గంటలకు రిజిస్టర్ చేసి గుట్టు చప్పుడు కాకుండా వేరొకరి పేరుతో మార్చుకున్నారని బాధితుడు వాపోయాడు. జీతాల డబ్బుతో కొన్న ఏడెకరాల భూమి పోయిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. అయితే కుటుంబ సమస్యలు లేక ప్రభుత్వాధినేతలకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో కొందరు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాధికారులు తమ సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. గతంలో కూడా చాలాసార్లు బాధితులు కలెక్టర్ను ఆశ్రయించారు.
Salt And BP: ఉప్పు మోతాదు పెరిగితే.. బీపీ బార్డర్ దాటుద్ది
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!