Yadadri: నేను ఆత్మహత్య చేసుకుంటా ప్లీజ్ అనుమతివ్వండి.. కలెక్టర్కు మాజీ ఉద్యోగి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri: ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ మాజీ ఉద్యోగి కలెక్టర్ను కోరారు. యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ బ్రేక్ ఇన్స్పెక్టర్ సయ్యద్ నూరిళ్ల ఇటీవల కలెక్టర్ను కలిశారు. ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సయ్యద్ నూరిల్లా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కారణాలను కూడా కలెక్టర్కు వివరించారు. సయ్యద్ నూరిళ్ల ఆర్టీసీ ఉద్యోగంలో ఉన్న సమయంలో వచ్చిన జీతం డబ్బులతో గ్రామంలో ఏడెకరాల పొలం కొన్నాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉండగా.. కొన్ని నెలల క్రితం భార్య ఆకస్మికంగా మృతి చెందింది. దీంతో తండ్రి పేరిట ఉన్న ఆస్తిపై చిన్నారి కన్ను పడింది. ఆస్తి తమ పేరు మీద రాయాలని కొంతకాలంగా తండ్రిపై పిల్లలు ఒత్తిడి తెస్తున్నారు. అయితే తహసీల్దార్కు తెలియకుండా రాత్రికి రాత్రే వేరొకరి పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సయ్యద్ నైరిల్లా ఆరోపిస్తున్నారు.
Read also: Cleaning Silk Sarees: ఇంట్లోనే పట్టుచీరల క్లీనింగ్కు 5 చిట్కాలు
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
ఎమ్మార్వో తీరుపై బాధితులు కలెక్టర్కు పలుమార్లు వినతిపత్రం అందించినట్లు తెలుస్తోంది. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని, తన భూమిని తిరిగి ఇప్పించాలని కలెక్టర్కు పలుమార్లు విన్నవించారు. అయితే కలెక్టర్ కూడా తన సమస్యను పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో చావుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ పిటిషన్లో ఆయన తన సమస్యను మరోసారి వివరించారు. ఎమ్మార్వో కావాలనే రాత్రి 9 గంటలకు రిజిస్టర్ చేసి గుట్టు చప్పుడు కాకుండా వేరొకరి పేరుతో మార్చుకున్నారని బాధితుడు వాపోయాడు. జీతాల డబ్బుతో కొన్న ఏడెకరాల భూమి పోయిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. అయితే కుటుంబ సమస్యలు లేక ప్రభుత్వాధినేతలకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో కొందరు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాధికారులు తమ సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. గతంలో కూడా చాలాసార్లు బాధితులు కలెక్టర్ను ఆశ్రయించారు.
Salt And BP: ఉప్పు మోతాదు పెరిగితే.. బీపీ బార్డర్ దాటుద్ది
తాజావార్తలు
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!