Hyderabad Bonalu LIVE UPDATES: బోనమెత్తిన భాగ్యనగరం.. పల్లెగా మారిన పట్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్దిచెందిన బోనాల ఉత్సవాలు హైదరాబాద్ మహానగరం సంస్కృతీ, సాంప్రదాయలకు పెట్టింది పేరు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బోనాల ఉత్సవాలు జనాల్లో ఆద్యంత భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి అందరికీ సుఖశాంతులు.. ఆయురారోగ్యాలు, అష్టైష్వర్యాలు కలిగిస్తాయనేది భక్తులు ప్రగాఢ విశ్వసం. అయితే.. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రజలకుండా ఉండడానికై తమకు అమ్మవార్లు రక్షణ కలిగించడంతో పాటు అండంగా ఉంటార నేది అనాదిగా వస్తున్న ఆచారం. కొన్ని వందల ఏళ్ళుగా జరుగుతున్న బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రధ్ధలతో జరుపుకుంటున్న విశిష్ఠ పండుగ.
అంతేకాకుండా తాము అమ్మవారికి సమర్పించే బోనాల వలన ఆ తల్లి చల్లని దీవెన మాకు ఎళ్ళవేళలా లభిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకమే సమస్త మానవాళిని ముందుకు నడిపిస్తూ.. భగవంతుడిపై వున్న నమ్మకం క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని అందజేస్తుంది. అందుకే బోనాల పండుగ అడుగడుగునా మనందరికీ భక్తితో కూడిన ఉత్సవాలను తలపిస్తూ ఉంటాయి. ఈనేపథ్యంలోనే.. బోనాల ఉత్సవాలు మహానగరంలో 300 సంవత్స రాల క్రితం నుంచే కొనసాగుతున్నట్లు మన చరిత్ర పేజీలు చెబుతున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం 300 సంవత్సరాల క్రితమే ఏర్పడినట్లు సమాచారం. గోల్కొండ కోట నిర్మితం కాకమునుపే ఎల్లమ్మ బోనాలు ప్రసిద్దిగాంచాయి. అదేవిధంగా అబుల్ హసన్ తానీషా కాలంలో జగదాంబికా మహంకాళి ఆలయ నిర్మాణం జరిగింది. అయితే.. ప్రతి ఏటా ఆషాడ మాసంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాగా.. మొట్టమొదట గోల్కోండ కోట బోనాలతో ప్రారంభమయ్యే బోనాలు పాతనగరం బోనాలతో ముగుస్తాయి.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
కాగా.. నేడు లాల్ దర్వాజ బోనాలతో నగరంలో సర్వాంగ సుందరంగా ప్రారంభమైంది. పట్నం మంతా పల్లె వాతావరణాన్ని తలపించే విధంగా ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అంగరంగ వైభవంగా బోనాలు ఉత్సవాలు జరిపేందుకు ఆలయ అధికారులు, మంత్రులు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తీ చేసారు. భక్తులు బోనం మెత్తి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!