KTR Tweet: అచ్చంపేటలో బీఆర్ఎస్ నేతలపై దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. “రాహుల్ జీ, ‘ప్రేమను పెంచుకోవడం’ అంటే ఇదేనా?” అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్కు బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసిన ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నాగర్కర్నూల్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పోస్ట్ చేసిన వీడియోను కేటీఆర్ జత చేశారు.
Read also: Indian 2 : సేనాపతి థియేటర్స్ లోకి ఏ రోజు వస్తాడో..?
అధికార దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థులపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ దాడులు, దౌర్జన్యాల్లో పోలీసులు కూడా ఉండడం సిగ్గుచేటని కేటీఆర్ అన్నారు. దాడికి పాల్పడిన గూండాలు, ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేశారు. తప్పకుండా న్యాయాన్ని గెలిపించుకుంటామని తెలిపారు. ఇంట్లో వెళ్లి ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదని అన్నారు. కార్యకర్తల కుటుంబాల్లో భయాందోళన చెందుతున్నారు అన్నారు.
Read also: MLA House Arrest: కొనసాగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్..
Yahi Hai Kya Aapki “Mohabbat Ki Dukaan” @RahulGandhi ?
Brazenly attacking opponents and abusing power. Shameful that police have become part of the abuse and attack @TelanganaDGP If you don’t act and book these goons and the spectator like cops, we will move the Human Rights… https://t.co/9VL4VjxD31
— KTR (@KTRBRS) May 15, 2024
Canada : కెనడాలో తగలబడుతున్న వేలాది ఎకరాల అడవి.. ప్రమాదంలో చమురు నిల్వలు