KTR: వెజ్, నాన్ వెజ్ మార్కెట్లపై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కేటీఆర్.. మోదీ సర్కార్, కాంగ్రెస్ పార్టీలపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతుంటారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తారు. తాజాగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణంపై కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు శరవేగంగా ఏర్పాటు చేస్తున్నామని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయా మార్కెట్లలో సాకాహారంతోపాటు మాంసాహారం కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. మున్సిపల్ శాఖ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఖమ్మం, నారాయణపేట, భువనగిరిలో అందుబాటులోకి వచ్చిన మార్కెట్ల ఫొటోలను షేర్ చేశారు. మార్కెట్ల నిర్మాణానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లను కేటీఆర్ ట్విట్టర్లో అభినందించారు.
This👇is a sample of how integrated veg & non-veg markets are being built by the Municipal Administration department in Telangana
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
Pics from Khammam Municipal Corporation 👍
My compliments to the Transport Minister @puvvada_ajay Garu, Mayor Garu and @cdmatelangana pic.twitter.com/VuYQowROUe
— KTR (@KTRBRS) February 14, 2023
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల అంశంపై చర్చ జరిగింది. 2 లక్షల జనాభాకు కనీసం ఒక మార్కెట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. శాస్త్రీయ విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మిస్తున్నామని శాసనసభలో కేసీఆర్ తెలిపారు. నేలపై కూరగాయలు విక్రయిస్తే బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉందన్నారు. మోండా మార్కెట్ తరహాలో రాష్ట్రంలోనూ మార్కెట్లు నిర్మించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో అధునాతన మార్కెట్లను ప్రభుత్వం ప్రారంభించిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Bandi Sanjay: కేసీఆర్ ఇంకా ఈటల ఆయన మనిషి అనుకుంటున్నారు
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..