KTR : ఉపఎన్నికలే కాంగ్రెస్కు గుణపాఠం
- షేక్పేటలో పర్యటించిన కేటీఆర్.. ఇంటింటికీ బకాయి కార్డుల పంపిణీ
- “కాంగ్రెస్ గ్యారంటీలన్నీ మోసం” అంటూ కేటీఆర్ ఆరోపణలు
- ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్న కేటీఆర్
- జూబ్లీహిల్స్ ప్రచారంలో టూరిస్టు మంత్రులపై ఎద్దేవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్పేట ప్రాంతంలో పర్యటించిన ఆయన, ప్రజలతో కలసి ప్రత్యేక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా “కాంగ్రెస్ బకాయి కార్డు” అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టారు. కేటీఆర్ తన బృందంతో కలిసి ఇంటింటికీ వెళ్లి బకాయి కార్డులను అందజేశారు. వాటిలో ప్రతి వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ ఉందో, ఏ ఏ వాగ్దానాలు నెరవేర్చలేదో స్పష్టంగా వివరించారు. ఈ కార్డుల ద్వారా కాంగ్రెస్ చేసిన మోసాలను, అసత్య వాగ్దానాలను ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అన్నీ మోసమే. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారు. బకాయి కార్డుల ద్వారా మేము ఈ మోసాన్ని బయటపెడతాం” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అహంకారానికి, వాగ్దానభంగానికి గుణపాఠం చెప్పే అవకాశం ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికలు రూపంలో వచ్చాయని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక ఓటమి చవి చూడాల్సిందేనని హెచ్చరించారు.
Also Read
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- OTR : కొందరు 'దరిద్రుల' వల్లే పార్టీ మారా!: పోచారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చేవారిని కేటీఆర్ “టూరిస్టు మంత్రులు” అంటూ ఎద్దేవా చేశారు. “ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ మంత్రులు, సామంతులు అందరూ గాయబ్ అయిపోతారు. ప్రజల సమస్యలు ఎవరికీ పట్టవు” అని విమర్శించారు. తమ పక్షాన ప్రజాభిప్రాయం బలంగా మారుతోందని, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల తీర్పు త్వరలోనే స్పష్టమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
-
Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!