KTR : హైదరాబాద్ ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి
- గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయారు
- ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాం
- బీఆర్ఎస్ హయాంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం
- గ్రామీణ ప్రాంతాల్లో కంటే హైదరాబాద్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది
- విద్యావంతులు ఉన్న HYDలో ఓటింగ్ శాతం తక్కువ ఉండటం బాధాకరం
- ఓటు వేసేందుకు ముందుకు రాకుంటే.. రిగ్గింగ్ జరిగే అవకాశం ఎక్కువ. -కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వేగంగా సాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం షేక్పేట్లోని ఆదిత్య ఇంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధించిందని చెప్పారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది మా ప్రియమైన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఎన్నిక. మాగంటి కుటుంబం ఈ నియోజకవర్గంలో ఎంతో సేవ చేసింది. అందుకే వారి భార్య మాగంటి సునీతమ్మకు టికెట్ ఇచ్చాం. మా పార్టీ ఎప్పుడూ తమ నాయకుల కుటుంబాలను గౌరవంగా చూసుకుంటుంది అని అన్నారు.
Also Read
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
“సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఎందుకంటే నగర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. మా పాలనలో ఐటీ రంగం అద్భుతంగా అభివృద్ధి చెందింది, దేశ నలుమూలల నుంచి ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్కి వస్తున్నారు. కోవిడ్ సమయంలో కూడా ఆ అవకాశాన్ని వదిలిపెట్టకుండా అనేక నిర్మాణ పనులు, ఫ్లైఓవర్లు, మెట్రో ప్రాజెక్టులు చేపట్టాం. ఇప్పటివరకు 42 ఫ్లైఓవర్లు, 70 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం పూర్తి చేశాం” అని వివరించారు.
“వ్యవసాయ రంగంలో తెలంగాణ ఇప్పుడు పంజాబ్, హర్యానాలకు సాటి అవుతోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో ఇది సాధ్యమైంది. ఒకప్పుడు నగరంలో జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు తప్పనిసరిగా కనిపించేవి, కానీ ఇప్పుడు కరెంట్ కోతలు, నీటి కొరత లేని స్థాయికి అభివృద్ధి చేసాం. హరితహారంతో రాష్ట్రాన్ని గ్రీన్ ఎకానమీగా మార్చాం” అని కేటీఆర్ తెలిపారు.
“హైదరాబాద్లో విద్యావంతులు ఎక్కువగా ఉన్నా, ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. ఇది బాధాకరం. మీరు ఓటు వేయడానికి రాకపోతే రిగ్గింగ్కి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలి,” అని కేటీఆర్ అన్నారు. “అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. సంక్షేమ పథకాలతో ప్రతి వర్గం లబ్ధి పొందింది. గంగా–జమున తహసీబ్ సంస్కృతిని కాపాడాం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రామీణ ప్రజలను మోసం చేసింది. అయినా కేవలం ఒకటిన్నర శాతం తేడాతోనే బీఆర్ఎస్ ఓడిపోయింది,” అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్పై ముస్లిం మతగురువు ఆగ్రహం
-
AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
-
Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు
-
Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
-
RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!