KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
- తాగునీటికే కృష్ణా జలాలు
- 50:50 వాటాపై తెలంగాణ ప్రతిపాదన
- పోతిరెడ్డిపాడుపై మళ్లీ వివాదం
- 47 టీఎంసీలపై ఏపీ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KRMB : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో నీటి వాటాల వినియోగంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని కమిటీ నిర్ణయించింది.
తాగునీటి పంపిణీపై తెలంగాణ ప్రతిపాదనలు
సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు మాట్లాడుతూ.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి పంపిణీని 50:50 రేషియో ప్రాతిపదికన చేపట్టాలని కమిటీ ముందు ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా చేపడుతున్న నీటి వాడకంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ ఇప్పటికే తమ వాటా కంటే అదనంగా 10 టీఎంసీల నీటిని వాడుకుందని, ఇకపై అక్కడ నుంచి నీటిని వాడబోమని ఏపీ అధికారులు వెల్లడించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తాగునీటి అవసరాల సాధ్యాసాధ్యాలపై విస్తృతంగా చర్చించేందుకు సెప్టెంబర్ 4వ తేదీన మరొక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
- TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
నీటి వినియోగంపై ఏపీ స్పందన
ఏపీ ఈఎన్సీ నరసింహ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం వల్ల తాగునీటి ప్రాధాన్యతపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. ఏడాది మొత్తం నీటి వినియోగానికి సంబంధించిన నివేదికను తెలంగాణ అందించగా, ఏపీ మాత్రం అక్టోబర్ నెల వరకు అవసరమైన నీటి పంపిణీకి ప్రతిపాదనలు పెట్టింది. రాబోయే కాలానికి సంబంధించి 47 టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ కోరగా, దానికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో నీటి వాటాల నిష్పత్తికి సంబంధించిన అంశం చర్చకు రాలేదని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా, పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్కు 22 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణ సమ్మతించిందని ఏపీ ఈఎన్సీ వెల్లడించారు.
తాజావార్తలు
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్తో గొడవ.. యశస్వి జైస్వాల్కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!