Konda Surekha : రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ లను కలిశారు. ఈ భేటీలో గత కొద్ది రోజులుగా తాను ఎదుర్కొంటున్న పరిణామాలను మంత్రి సురేఖ వివరించారు. సమావేశంలో ఆమె తన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, పోలీసుల చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా, నిన్న రాత్రి తన నివాసానికి పోలీసులు రావడం, ఆ సమయంలో జరిగిన ఘటనలను ఆమె పార్టీ నేతలకు వివరించారు.
Tragedy : వేశ్యగా మారి కట్టుకున్న భర్తను.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్తో కేసు ఛేదించిన పోలీసులు
భేటీ అనంతరం మీడియాతో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. “ నా ఆలోచనలు..ఇబ్బందులు చెప్పుకున్నా.. నా సమస్య పరిష్కరించేందుకు పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. అన్ని విషయాలు సెటిల్ అవుతాయని చెప్పారు. నేను కూడా ఆ భరోసాతోనే వెళ్తున్నా,”
అని వ్యాఖ్యానించారు. అలాగే, గత కొన్ని రోజులుగా తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Bhupathiraju Srinivasa Varma: త్యాగానికి చిహ్నం కర్నూలు.. ఇది ఒక నగరం మాత్రమే కాదు.. ఒకప్పటి రాజధాని..