Komatireddy: సినిమా వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయలేదని, దిల్ రాజు ఒక్కడే ఫోన్ చేశారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదేళ్ళ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అన్నారు. అమెరికా ఈజ్ గ్రేట్… అమెరికన్ రోడ్స్ ఈజ్ గ్రేట్ అని పొగడ్తలతో ముంచేశారు. నాకు రోడ్లు భవనాలు శాఖ ఇచ్చినందుకు థాంక్స్ అన్నారు. కౌన్సిల్ హాల్ ను షిఫ్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇలా చేసే భాద్యత నాకు అప్పగించారని తెలిపారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేపడతామన్నారు. ఈరోజు తొమ్మిది ముఖ్య ఫైల్స్ పై సంతకాలు చేసాఅని తెలిపారు.
Read also: Komatireddy: సచివాలంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మంత్రిగా బాధ్యతలు స్వీకరణ
తన నియోజకవర్గ పరిధిలోని రోడ్లను 100 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చబోతున్నామని తెలిపారు. మా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. రేపు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని.. నితిన్ గడ్కరీ అపాయింట్ మెంట్ తీసుకు వస్తా అన్నారు. తనకున్న పరిచాయలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకు వస్తా అని హామీ ఇచ్చారు. సినిమా వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయలేదని.. ఒక్క దిల్ రాజు మాత్రమే ఫోన్ చేశారని అన్నారు. ఎల్బీనగర్ మల్కాపురం వరకు, మల్కాపురం నుంచి సూర్యాపేట వరకు 6 లైన్ల రోడ్డు పనులు చేయాలన్నారు. పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తుందని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కంటే ముందే విజయవాడకు వెళ్లే విధముగా చేస్తామన్నారు. కొత్త అసెంబ్లీలో నిర్మాణం లేదని, పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరిగా మారుస్తామన్నారు.
Congress: “ఆ ఎంపీ బిజినెస్లో మాకు సంబంధం లేదు”.. ఐటీ రైడ్స్కి దూరంగా కాంగ్రెస్..