Rajagopal Reddy Resigns as MLA: నేడు స్పీకర్కు రాజీనామా లేఖ అందజేయనున్న రాజగోపాల్ రెడ్డి..! ఆమోదిస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajagopal Reddy Resigns as MLA: తెలంగాణ కాంగ్రెస్లో మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారం హాట్టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అయితే రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు అందుకు గల కారణాలను వివరిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. అయితే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు.. అందుకోసం స్పీకర్ అపాయిట్మెంట్ కోసం చూస్తున్నట్లు ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేడు స్పీకర్కు రాజీనామా లేఖను అందించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు స్పీకర్ తనకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఈనేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామను స్పీకర్ ఆమోదిస్తే..? ఆరు నెలల లోపు మునుగోడు ఉప ఎన్నిక రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే రాజీనామా స్పీకర్ తనకు అందిన వెంటనే ఆమోదిస్తారా? లేదా న్యాయ సలహా తీసుకుని ఆమోద ముద్ర వేస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
read also: Sravana Putrada Ekadasi Live: శ్రావణ పుత్రదా ఏకాదశి శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే ..
Also Read
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఈ నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎన్టీవీ ఇంటర్వ్యూ నిర్వహించిన విషయం తెలిసిందే.. అయితే ఇంటర్య్వూలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రజల కోసం ఇద్దరం ఒకేరకంగా ఆలోచిస్తామని వెల్లడించారు. నా ఆలోచన, మా అన్నయ్య ఆలోచన ఒకటేనని, వెంకట్ రెడ్డి పార్టీ మార్పుపై పరోక్షంగా హింట్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు సమస్యలపై ఎన్నో సార్లు మాట్లాడాను. పత్రిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ప్రభుత్వం పట్టించుకోదు. ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజాశక్తి గొప్పదని హుజురాబాద్లో ప్రజలు నిరూపించారు. నన్ను నమ్మి ఓటు వేసిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? అంటూ ప్రశ్నించారు. ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నా. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాలు మారిపోతాయని పేర్కొన్నారు. నేను బాధతోనే కాంగ్రెస్కు రాజీనామా చేశా. నాకు కాంగ్రెస్ అంటే ఇష్టమే అని ప్రస్తావించారు. మునుగోడు ప్రజలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. మా దగ్గర అవినీతి సొమ్ము లేదని తెలిపారు. ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తిని ముందు పెట్టాలని అధిష్టానాన్ని కోరామన్నారు. కాంగ్రెస్లో సరైన నాయకత్వం లేదు. నాయకత్వాన్ని లీడ్ చేసే వ్యక్తికి క్రెడబులిటీ, కెపాసిటీ ఉండాలి. కుంతియా గురించి వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడానని అన్నారు. . 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా నాయకత్వాన్ని మార్చలేదు. పార్టీలో నాకు ఎలాంటి పదవి లేదు. అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..