Kishan Reddy: నాకు ఓటేసి గెలిపించండి.. ఢిల్లీకి పంపండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: నాకు ఓటేసి గెలిపించండి.. ఢిల్లీకి పంపండని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఢిల్లీ ఎన్నికలు అన్నారు. ఎవరు ప్రధానమంత్రి అయితే దేశం బాగుంటుంది? ఎవరు ప్రధానమంత్రి అయితే మన గౌరవం పెరుగుతుంది? ఎవరు సమర్థవంతంగా ముందుకు తీసెళ్తారో వాళ్లకు ఓటెయ్యాలని కోరుతున్నాను అన్నారు. స్వాత్యంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ ప్రధాని అయ్యే వరకు దేశం ఎలా ఉందో బేరీజు వేసి మోడీకి ఓటెయ్యండి అని కోరారు. అందరూ పోలింగ్ లో పాల్గొనాలి అని కోరారు. అమీర్ పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లలో 40% పోలింగ్ కూడా జరగదన్నారు.
Read also: Tellam Venktrao : కాంగ్రెస్లోకి తెల్లం వెంకట్రావ్
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేసే దగ్గర 80% పోలింగ్ అవుతుందన్నారు. ఎవరికి అయిన ఓటెయ్యండి కానీ ఓటు వేయడానికి ముందుకు రండీ అన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచడాన్ని ఒక మూవ్మెంట్ లాగా తీసుకెళ్లాలన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసినప్పటి నుంచి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అని వందల సార్లు చర్చలు చేశారన్నారు. కొత్త పార్లమెంట్ లో మొదటి బిల్లు చట్టసభల్లో మహిళల కోసం ప్రవేశపెట్టామన్నారు. చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించారు మోడీ అన్నారు. ఇస్లామిక్ దేశాల్లో కూడా ట్రిపుల్ తలాక్ లేదన్నారు. కాంగ్రెస్ పాలించిన ఈ ఆటవిక సంప్రదాయాన్ని కొనసాగించిందన్నారు. మహిళల మెడలో కత్తిలాగా ట్రిపుల్ తలాక్ వేలాడిందన్నారు.
Read also: Jagadish Reddy: కేసీఆర్ రాకతో లాగులు తడిసి బాహుబలి మోటర్లు అన్ చేశారు..
ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛను ఇచ్చారన్నారు. నిన్న రాహుల్ గాంధీ ఒక మాట చెప్పాడని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ తీసుకొస్తామన్నాడని తెలిపారు. లవ్ జిహాద్ ని కూడా చట్టబద్ధం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పాడని గుర్తు చేశారు. ఓట్ల కోసం ఇంత దిగజారుతారా.? అని మండిపడ్డారు. సైన్యంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించారన్నారు. మహిళల గౌరవాన్ని పెంచడానికి 13 కోట్ల టాయిలెట్స్ నిర్మించారని తెలిపారు. నాకు మనసు పూర్తిగా ఓటేసి.. గెలిపించి.. ఢిల్లీకి పంపాల్సిందిగా కోరుతున్నానని అన్నారు.
Etela Rajender: దానం నాగేందర్ కు ఎట్లా ఎంపీ సీట్ ఇస్తారు..?
తాజావార్తలు
-
Killer Movie Accident: ఎస్.జె.సూర్య ‘కిల్లర్’ సెట్స్లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
-
CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?
-
4 Years of Vikram: లోకనాయకుడి ‘విక్రమ్’ కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
-
Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!