Kishan Reddy : ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం
- 8వ వేతన సవరణ సంఘానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
- ఉద్యోగుల సంక్షేమానికి మరో కీలక అడుగు
- మోదీ ప్రభుత్వ సంస్కరణల కొనసాగింపు
- 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ దిశగా కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయంపై కేంద్రమంత్రి జీ. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 8వ వేతన సవరణ సంఘం (8th Pay Revision Commission) విధివిధానాలను ఆమోదించినందుకు కేంద్ర కేబినెట్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన స్పందించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నినాదం ఆధారంగా దేశంలోని ప్రతి వర్గం సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కృషికి సరైన గుర్తింపు ఇవ్వడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
వేతన సవరణతో ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉత్పాదకత పెరిగి ప్రజా సేవల నాణ్యత మరింత మెరుగవుతుందన్నారు. ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగుపడటం ద్వారా దేశీయ వినియోగం పెరిగి, ఆర్థిక వృద్ధికి కూడా ఊతమిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన పేర్కొంటూ – “మోదీ గారు నాయకత్వం వహించిన తర్వాత 2016లో 7వ వేతన సవరణ కమిషన్ ద్వారా ఉద్యోగులకు అనుకూలమైన సంస్కరణలు తీసుకువచ్చారు.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
2006లో జరిగిన 6వ పీఆర్సీలో కనీస వేతనం రూ.7 వేలుగా ఉండగా, 7వ పీఆర్సీలో దాన్ని రెండున్నర రెట్లు పెంచి రూ.18 వేలుగా నిర్ణయించారు. అంతేకాకుండా, కనీసం 3 శాతం ఇంక్రిమెంట్ తప్పనిసరిగా ఇవ్వాలనే నిర్ణయం కూడా మోదీ ప్రభుత్వంలోనే తీసుకున్నారు” అని గుర్తుచేశారు. ఇప్పుడు 8వ పీఆర్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరిన్ని మార్పులు తీసుకువచ్చిందని, ఈ నిర్ణయం ద్వారా 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకు పైగా పెన్షనర్లు లబ్ధి పొందనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి ద్విగుణీకృత ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.
Baahubali: The Epic: బాహుబలి రీ రిలీజ్ ప్రీమియర్.. జనం ఇంత కాళీగా ఉన్నారా?
తాజావార్తలు
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
-
Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!