Kishan Reddy: సీఎం మీకు చిత్త శుద్ది ఉందా? సీబీఐ విచారణకు లేఖ రాస్తారా లేదా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: సీఎం మీకు చిత్త శుద్ది ఉందా లేదా…..సీబీఐ విచారణ కు లేఖ రాస్తారా లేదా? అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తె కేసీఆర్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అవినీతి ప్రాజెక్ట్ ల మీద విచారణ జరుపుతామని చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం అని 15 ఈఫిల్ టవర్ లకు వాడినంత ఉక్కు, 7 బుర్జు ఖలీఫా లకు వాదినంట కాంక్రీట్ వాడామని గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. డిస్కవరీ ఛానల్ లో ప్రచారం చేసుకున్నారు… గిన్నిస్ రికార్డ్ అన్నారని తెలిపారు. కాళేశ్వరం భవిష్యత్ ఏంటి? లక్ష కోట్ల ఖర్చు పరిస్థితి ఏంటన్నారు. ఎన్నికలకి ముందు ఇప్పటి సీఎం మాట్లాడింది ఏంటి ఆలోచించాలన్నారు. రీ ఇంజనీరింగ్ రివర్స్ ఇంజనీరింగ్ అయిందన్నారు. కాళేశ్వరం వల్ల తెలంగాణ ఇమేజ్ ను గోదావరిలో కలిపేశారని అన్నారు. మేడి గడ్డ కుంగిన ఘటనపై వెంటనే కేంద్రానికి పిర్యాదు చేసామన్నారు. కేంద్రం డ్యాంసేఫ్టీ అథారిటీ విజీట్ చేసిందన్నారు. అధికారులతో సమీక్ష చేసిందని అన్నారు. మరిన్ని వివరాలు కావాలని లిఖిత పూర్వకంగా అడిగిందని తెలిపారు. ఇప్పటివరకు వివరాలు ఇవ్వక పోవడం దురదృష్టం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: MLA MS Babu: సీఎం జగన్పై విరుచుకుపడ్డ వైసీపీ ఎమ్మెల్యే.. మీరు చెప్పిందే చేశా.. నా తప్పంటే ఎలా?
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
20 అంశాల్లో కేవలం 11 వాటికి అరకొర రిప్లై ఇచ్చారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి అద్దం పట్టేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కళ్ళ ముందు కనిపిస్తుందన్నారు. విచారణ పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఊచలు లెక్కపెడుతుందన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మోడీ ఏమీ చేస్తున్నారని, కేంద్రం ఏమీ చేస్తుంది, కిషన్ రెడ్డి ఏమీ చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి పదే పడే అడిగారు.. కాళేశ్వరం పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా…దోషులకు శిక్ష పడాలని అనుకుంటున్నారా లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ , అవినీతితో కలిసి కాపురం చేసిందన్నారు. ప్రజాధనాన్ని కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు ప్రజా ధనాన్ని దోపిడీ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల డీఎన్ఏ ఒక్కటే అన్నారు. మనం వేర్వేరు కాదు అన్నటుగా ఆ రెండు పార్టీ లు తోడు దొంగలాట ఆడుతున్నారు…అందుకే మెతక వైఖరి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటైర్డ్ జడ్జితో విచారణ అంటున్నారు కదా.. ఎప్పుడు సీబీఐ విచారణ ఎందుకు అడిగారు? అని ప్రశ్నించారు.
Read also: Ram Charan: ఆ శంకర్ తో ఇలా ఇరుక్కుపోయావ్ ఏంటి అన్న… ఇండియన్ 2 అయిపోయి 3 అంటున్నాడు?
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అత్యంత పెద్ద అవినీతి కాళేశ్వరం అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మీకు చిత్త శుద్ది ఉందా లేదా…..సీబీఐ విచారణ కు లేఖ రాస్తారా లేదా? అని ప్రశ్నించారు. ఎంఐఎం మధ్యవర్తిత్వం వహించి ఏదైనా అంగీకారం కుదిర్చిందా? కేసీఆర్ పీడ విరగడ కావాలని ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారని అన్నారు. కేసీఆర్ కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మితే ఊడి పోయే ప్రభుత్వం అని కేసీఆర్ తో ఏదైనా ఒప్పందానికి వచ్చారా? అనే ది ప్రజలకు తెలవాలన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాదనుకుంటే దమ్ముంటే సీబీఐ విచారణ కు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆదేశిస్తే 48 గంటల్లో సీబీఐ విచారణ ప్రారంభిస్తుందననారు. ఇళ్ళలక గానే పండుగ కాదు… ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. ఎన్నికలకి ముందు సీబీఐ ఎంక్వైరీ అన్నారు… ఇప్పుడు జ్యుడిషరీ ఎంక్వైరీ ఎందుకు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!