NTV Telugu Site icon

Kishan Reddy: కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నారు ఏదీ..? రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ప్రశ్న..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: కొత్త రేషన్ కార్డ్స్, పెన్షనలు అన్నారు ఏమైంది రేవంత్ రెడ్డి.? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయింది.. కేసీఆర్ ఫాం హౌజ్ కు పోయిండని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వందల ఎకరాలు దోచుకున్నాడు కేసీఆర్ అని మండిపడ్డారు. వేల కోట్లు సంపాదించింది కేసీఆర్ కుటుంబం అన్నారు. ఇసుక దోపిడీ, గ్రానైట్ దోపిడి చేసింది కేసీఆర్ కుటుంబం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు.. ఇంకా అమలు చేయలేదన్నారు.

Read also: Teacher Harassment: చిన్నారిపై టీచర్‌ లైంగిక వేధింపులు.. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు. కొత్త రేషన్ కార్డ్స్, పెన్షనలు అన్నారు ఏమైంది రేవంత్ రెడ్డి.? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన పాపానికి ప్రజల మీద రాహుల్ గాంధీ టాక్స్ వేసి ఢిల్లీకి పంపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తారో ఆలోచించి వారికి ఓటెయ్యాలని అన్నారు. దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి కరోనా నుంచి మనల్ని కాపాడాడు మోడీ అన్నారు. పేదలకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నాడు.. ఇంకా కొనసాగిస్తామని చెప్పాడు మోడీ తెలిపారు.

Read also: K. Laxman: మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరు.. కేసీఆర్‌ పై లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రకాలుగా ముందు వెళ్తుందన్నారు. 500 ఏళ్ల తరువాత రాముడి గుడి కట్టుకున్నామన్నారు. మోడీ దేశాన్ని భద్రంగా ఉంచుతున్నాడని తెలిపారు. బీసీ సామాజిక వర్గం నుంచి మొదటిసారి మోడీ ప్రధాని అయ్యాడన్నారు. మోడీ సామాన్య కుటుంబం నుంచి వచ్చాడన్నారు. దేశం కోసం.. సమాజం కోసం పని చేస్తాం.. పేదవాళ్లని ఆదుకుంటామన్నారు. నన్ను ఆశీర్వదించండి.. మోడీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
Cold Water: వేసవిలో చల్లటి నీటితో స్నానం చేస్తే..