Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు..
- సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభం..
- మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి-తుమ్మల నాగేశ్వరరావు-పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు..
- పుసుగూడెం- కమలాపురం పంపుహౌస్లను పరిశీలించిన మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. అనంతరం పుసుగూడెం, కమలాపురం పంపుహౌస్లను మంత్రులు పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్ 3 పంపు హౌస్లు ప్రారంభానికి సిద్ధంగా వున్నట్లు తెలిపారు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పంప్ హౌజ్ ల ప్రారంభోత్సవం రోజున ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల కేటాయింపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
Read also: Pigeon Droppings: పావురంతో ప్రాణాంతక వ్యాధులు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. ప్రతి ఎకరాకు నీరందించి సాగులోకి తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ అధికారులు పనులు వేగవంతం చేయాలని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ అనుమతులు తుది దశకు చేరుకున్నాయని, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వద్దకు చేరాయని మంత్రి ఉత్తమ్ ప్రస్తావించారు. అదే సమయంలో సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల అనుమతులపై దృష్టి సారించి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. కాలువల నిర్మాణానికి అడ్డుగా ఉన్న రైల్వే క్రాసింగ్ ల వద్ద నిర్మాణాలు ఆగకుండా శాఖాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
Read also: Cough Medicine: దగ్గు మందులతో సైడ్ ఎఫెక్ట్స్..? షాకింగ్ నిజాలు..!
మంత్రి తుమ్మల మాట్లాడుతూ..
ఎంతో సంతోషకరమైన రోజని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఉమ్మడి ఖమ్మం జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరా సాగర్ భూభాగం ఆంధ్రా లో కలవడం రాజీవ్ సాగర్ అటవీ ప్రాంతం సమస్యలు వల్ల సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన అన్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయన్నారు. పంప్ హౌస్ ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. కృష్ణా జలాలు సకాలంలో రాకపోతే ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో వైరా లింక్ కెనాల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలన్నారు. జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు చేరతాయన్నారు. ఆగస్ట్ 15 న సీతారామ ప్రాజెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని అన్నారు.
Read also: Shamshabad Airport: వాట్ ఏ ఐడియా సార్ జీ.. బూట్ లో కోటి విలువైన విదేశీ బంగారం..
Read also: Shamshabad Airport: వాట్ ఏ ఐడియా సార్ జీ.. బూట్ లో కోటి విలువైన విదేశీ బంగారం..
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..
సీతారాం ప్రాజెక్టు ట్రయల్ రన్ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 15 న సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ సీఎం చేత ప్రారంభం ఉంటుందని తెలిపారు. గోదావరి జలాలను కృష్ణా జలాలను అనుసంధానం చేయనున్నామన్నారు. ఆనాడు వైఎస్ఆర్ 2400 కోట్ల తో రాజీవ్ ఇందిరా సాగర్ ప్రతిపాదన చేశారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రిడిజైన్ పేరుతో రెండు వేల కోట్ల 18000 కోట్ల కు పెంచారన్నారు. 8000 కోట్లు ఖర్చు పెట్టిన ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.గత ప్రభుత్వం ఇరిగేషన్ ను విద్వంసం చేసిందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా చేస్తున్నామన్నారు. అన్ని ప్రాజెక్టు లను గాడి లో పెడుతున్నామని తెలిపారు.
Jeedimetla Accident: ప్రాణం తీసిన అతివేగం.. కారు ఢీకొట్టడంతో వ్యక్తి స్పాట్ డెడ్..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!