Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు..
- సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభం..
- మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి-తుమ్మల నాగేశ్వరరావు-పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు..
- పుసుగూడెం- కమలాపురం పంపుహౌస్లను పరిశీలించిన మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. అనంతరం పుసుగూడెం, కమలాపురం పంపుహౌస్లను మంత్రులు పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్ 3 పంపు హౌస్లు ప్రారంభానికి సిద్ధంగా వున్నట్లు తెలిపారు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పంప్ హౌజ్ ల ప్రారంభోత్సవం రోజున ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల కేటాయింపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
Read also: Pigeon Droppings: పావురంతో ప్రాణాంతక వ్యాధులు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. ప్రతి ఎకరాకు నీరందించి సాగులోకి తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ అధికారులు పనులు వేగవంతం చేయాలని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ అనుమతులు తుది దశకు చేరుకున్నాయని, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వద్దకు చేరాయని మంత్రి ఉత్తమ్ ప్రస్తావించారు. అదే సమయంలో సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల అనుమతులపై దృష్టి సారించి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. కాలువల నిర్మాణానికి అడ్డుగా ఉన్న రైల్వే క్రాసింగ్ ల వద్ద నిర్మాణాలు ఆగకుండా శాఖాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
Read also: Cough Medicine: దగ్గు మందులతో సైడ్ ఎఫెక్ట్స్..? షాకింగ్ నిజాలు..!
మంత్రి తుమ్మల మాట్లాడుతూ..
ఎంతో సంతోషకరమైన రోజని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఉమ్మడి ఖమ్మం జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరా సాగర్ భూభాగం ఆంధ్రా లో కలవడం రాజీవ్ సాగర్ అటవీ ప్రాంతం సమస్యలు వల్ల సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన అన్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయన్నారు. పంప్ హౌస్ ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. కృష్ణా జలాలు సకాలంలో రాకపోతే ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో వైరా లింక్ కెనాల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలన్నారు. జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు చేరతాయన్నారు. ఆగస్ట్ 15 న సీతారామ ప్రాజెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని అన్నారు.
Read also: Shamshabad Airport: వాట్ ఏ ఐడియా సార్ జీ.. బూట్ లో కోటి విలువైన విదేశీ బంగారం..
Read also: Shamshabad Airport: వాట్ ఏ ఐడియా సార్ జీ.. బూట్ లో కోటి విలువైన విదేశీ బంగారం..
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..
సీతారాం ప్రాజెక్టు ట్రయల్ రన్ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 15 న సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ సీఎం చేత ప్రారంభం ఉంటుందని తెలిపారు. గోదావరి జలాలను కృష్ణా జలాలను అనుసంధానం చేయనున్నామన్నారు. ఆనాడు వైఎస్ఆర్ 2400 కోట్ల తో రాజీవ్ ఇందిరా సాగర్ ప్రతిపాదన చేశారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రిడిజైన్ పేరుతో రెండు వేల కోట్ల 18000 కోట్ల కు పెంచారన్నారు. 8000 కోట్లు ఖర్చు పెట్టిన ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.గత ప్రభుత్వం ఇరిగేషన్ ను విద్వంసం చేసిందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా చేస్తున్నామన్నారు. అన్ని ప్రాజెక్టు లను గాడి లో పెడుతున్నామని తెలిపారు.
Jeedimetla Accident: ప్రాణం తీసిన అతివేగం.. కారు ఢీకొట్టడంతో వ్యక్తి స్పాట్ డెడ్..
తాజావార్తలు
-
IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!