Jeedimetla Accident: ప్రాణం తీసిన అతివేగం.. కారు ఢీకొట్టడంతో వ్యక్తి స్పాట్ డెడ్..
- అతివేగంతో సెక్యూరిటీ గార్డును ఢీ కొట్టిని కారు..
- జీడిమెట్ల పరిధి గాజుల రామారం లో ఘటన..
- స్పాట్ లోనే మృతి చెందిన గోపి..
Jeedimetla Accident: మద్యం మత్తు.. అతివేగం, అజాగ్రత్త.. పలువురి ప్రాణాలను తీస్తోంది.. కొందరి వికృత చేష్టలతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా.. హైస్పీడ్ తో వస్తున్న కారు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో చోటుచేసుకుంది.
Read also: Shamshabad Airport: వాట్ ఏ ఐడియా సార్ జీ.. బూట్ లో కోటి విలువైన విదేశీ బంగారం..
Also Read
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
గాజులరామారం వద్ద బాషా గోపి అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే గాజులరామారం వద్ద క్రాసింగ్ లో ఇటు నుంచి ఒక బైక్ వెళుతున్న క్రమంలో అటు నుంచి హై స్పీడ్ లో కారు దూసుకు వచ్చింది. అయితే బైక్ ను తప్పించబోయి.. ఎదురుగా వున్న సెక్యూరిటీ గార్డు గోపిని బలంగా ఢీకొట్టింది. అంతే గోపి ఒక్కసారిగా పైకి లేచి అవతల పడ్డాడు. కారు బలంగా ఢీ కొట్టడంతో గోపీ స్పాట్ లోనే చనిపోయాడు. అయితే కారులో వున్న వ్యక్తులు మెల్లగా ఏమీ తెలియనట్లు ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చి ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. అయితే డ్రైవింగ్ చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
Read also: Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు..
హుటా హుటిన ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. కారులో వున్న ఐదు మంది పరారీలో వున్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. టనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దాని అధారంగా పరారీలో వున్న ఐదుగురిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు బాషా గోపి తండ్రి నర్సింలు కొద్ది రోజుల క్రితం మరణించాడు. అయితే గోపీ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి లేని కుటుంబంలో పెద్ద దిక్కుగా వున్న కొడుకు గోపి కూడా మృతి చెందడంతో కుటుంబం విషాధ ఛాయలు అలుముకున్నాయి. తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Pigeon Droppings: పావురంతో ప్రాణాంతక వ్యాధులు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!