Jeedimetla Accident: ప్రాణం తీసిన అతివేగం.. కారు ఢీకొట్టడంతో వ్యక్తి స్పాట్ డెడ్..
- అతివేగంతో సెక్యూరిటీ గార్డును ఢీ కొట్టిని కారు..
- జీడిమెట్ల పరిధి గాజుల రామారం లో ఘటన..
- స్పాట్ లోనే మృతి చెందిన గోపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeedimetla Accident: మద్యం మత్తు.. అతివేగం, అజాగ్రత్త.. పలువురి ప్రాణాలను తీస్తోంది.. కొందరి వికృత చేష్టలతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా.. హైస్పీడ్ తో వస్తున్న కారు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో చోటుచేసుకుంది.
Read also: Shamshabad Airport: వాట్ ఏ ఐడియా సార్ జీ.. బూట్ లో కోటి విలువైన విదేశీ బంగారం..
Also Read
- Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
గాజులరామారం వద్ద బాషా గోపి అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే గాజులరామారం వద్ద క్రాసింగ్ లో ఇటు నుంచి ఒక బైక్ వెళుతున్న క్రమంలో అటు నుంచి హై స్పీడ్ లో కారు దూసుకు వచ్చింది. అయితే బైక్ ను తప్పించబోయి.. ఎదురుగా వున్న సెక్యూరిటీ గార్డు గోపిని బలంగా ఢీకొట్టింది. అంతే గోపి ఒక్కసారిగా పైకి లేచి అవతల పడ్డాడు. కారు బలంగా ఢీ కొట్టడంతో గోపీ స్పాట్ లోనే చనిపోయాడు. అయితే కారులో వున్న వ్యక్తులు మెల్లగా ఏమీ తెలియనట్లు ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చి ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. అయితే డ్రైవింగ్ చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
Read also: Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు..
హుటా హుటిన ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. కారులో వున్న ఐదు మంది పరారీలో వున్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. టనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దాని అధారంగా పరారీలో వున్న ఐదుగురిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు బాషా గోపి తండ్రి నర్సింలు కొద్ది రోజుల క్రితం మరణించాడు. అయితే గోపీ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి లేని కుటుంబంలో పెద్ద దిక్కుగా వున్న కొడుకు గోపి కూడా మృతి చెందడంతో కుటుంబం విషాధ ఛాయలు అలుముకున్నాయి. తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Pigeon Droppings: పావురంతో ప్రాణాంతక వ్యాధులు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..
తాజావార్తలు
-
Instant Onion Mixture: ఈ చిట్కా తెలిస్తే బయట ఫుడ్ అస్సలు కొనరు.. కేవలం 2 నిమిషాల్లో నోరూరుంచే స్నాక్ రెడీ!
-
Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
-
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?