Jeedimetla Accident: ప్రాణం తీసిన అతివేగం.. కారు ఢీకొట్టడంతో వ్యక్తి స్పాట్ డెడ్..
- అతివేగంతో సెక్యూరిటీ గార్డును ఢీ కొట్టిని కారు..
- జీడిమెట్ల పరిధి గాజుల రామారం లో ఘటన..
- స్పాట్ లోనే మృతి చెందిన గోపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeedimetla Accident: మద్యం మత్తు.. అతివేగం, అజాగ్రత్త.. పలువురి ప్రాణాలను తీస్తోంది.. కొందరి వికృత చేష్టలతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా.. హైస్పీడ్ తో వస్తున్న కారు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో చోటుచేసుకుంది.
Read also: Shamshabad Airport: వాట్ ఏ ఐడియా సార్ జీ.. బూట్ లో కోటి విలువైన విదేశీ బంగారం..
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
గాజులరామారం వద్ద బాషా గోపి అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే గాజులరామారం వద్ద క్రాసింగ్ లో ఇటు నుంచి ఒక బైక్ వెళుతున్న క్రమంలో అటు నుంచి హై స్పీడ్ లో కారు దూసుకు వచ్చింది. అయితే బైక్ ను తప్పించబోయి.. ఎదురుగా వున్న సెక్యూరిటీ గార్డు గోపిని బలంగా ఢీకొట్టింది. అంతే గోపి ఒక్కసారిగా పైకి లేచి అవతల పడ్డాడు. కారు బలంగా ఢీ కొట్టడంతో గోపీ స్పాట్ లోనే చనిపోయాడు. అయితే కారులో వున్న వ్యక్తులు మెల్లగా ఏమీ తెలియనట్లు ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చి ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. అయితే డ్రైవింగ్ చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
Read also: Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు..
హుటా హుటిన ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. కారులో వున్న ఐదు మంది పరారీలో వున్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. టనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దాని అధారంగా పరారీలో వున్న ఐదుగురిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు బాషా గోపి తండ్రి నర్సింలు కొద్ది రోజుల క్రితం మరణించాడు. అయితే గోపీ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి లేని కుటుంబంలో పెద్ద దిక్కుగా వున్న కొడుకు గోపి కూడా మృతి చెందడంతో కుటుంబం విషాధ ఛాయలు అలుముకున్నాయి. తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Pigeon Droppings: పావురంతో ప్రాణాంతక వ్యాధులు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!