Site icon NTV Telugu

KCR: కేసీఆర్ జిల్లాల పర్యటన.. ఎప్పుడంటే..

Kcr

Kcr

Padmavati Express: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రేపు పలు జిల్లాలో పర్యటించనున్నారు. నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతుల్లో ధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఈ నెల 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పంటలను పరిశీలించి రైతుల్లో ధైర్యం నింపనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అర్వపల్లికి వెళ్తారు. అనంతరం నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి రైతులను ప్రోత్సహించనున్నారు.

Read also: Uttarakhand: ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాని.. ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్‌ 2న మోడీ సభ!

ఇదిలావుండగా, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గద్వాల్ శుక్రవారం కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ నేతలతో సమావేశమై తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. మరో రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కడియం శ్రీహరి తెలిపారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని కడియం కావ్య ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఇతర నేతలు పార్టీని వీడారు. నేతలు పార్టీని వీడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీని వీడేటప్పుడు విమర్శిస్తున్నారని.. అందుకే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.. అందరికీ కాలమే సమాధానం చెబుతుందని.. ఓ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా పార్టీ సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తలు తగిన సలహాలు ఇచ్చారు.భవిష్యత్తులో వచ్చి కేసీఆర్ కాళ్లపై పడితే కూడా వారిని పార్టీలోకి రానివ్వబోమన్నారు.
Mukhtar Ansari : ముఖ్తార్ మృతదేహం చూసేందుకు భారీగా తరలివచ్చిన మద్దతుదారులు

Exit mobile version