MLC Kavitha : ఇది పనిచేసే ప్రభుత్వం కాదు.. వెంటే ఉండి పని చేయించుకోవాల్సిందే..!
- రాష్ట్రానికి కంటే ఢిల్లీకి ఎక్కువ సమయం
- హామీలు గాలిలో కలిసిపోయాయి... ప్రజలు మోసపోయారు
- ఇది పనిచేసే ప్రభుత్వం కాదు.. వెంటే ఉండి పని చేయించుకోవాల్సిందే : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేసిన ఆమె, ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్లే వ్యక్తిగా, రాష్ట్రానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు అమ్మాయిలకు స్కూటీలు, పెళ్లికి లక్ష రూపాయల నగదు, తులం బంగారం ఇస్తామని చేసిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలతోనే నిండి ఉన్నాయని ఆరోపించిన కవిత, సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్లో అంబులెన్సులకు డీజిల్ లేక అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.
Bhagavad Gita : భగవద్గీత పై ఏఐ షార్ట్ ఫిల్మ్..
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో 50 శాతం వరకు నాణ్యతలేని దొడ్డుబియ్యమే ఉండటం దారుణమని వ్యాఖ్యానించిన ఆమె, దీనిని ఆధారాలతో నిరూపిస్తామని చెప్పారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణాల పేరుతో గ్రామాలకు వెళ్లే బస్సులను తక్కువ చేశారని, ఫ్రీ పథకాలు అందిస్తామనే చెప్పి సేవలు కట్ చేసిన దారుణ పాలన ఇది అని విమర్శించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని కూడా ఆమె ఆరోపించారు. ఇది పనిచేసే ప్రభుత్వం కాదు… ప్రజలే వెంటే ఉండి పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హేళన చేసిన కవిత, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Radhika Yadav Murder: టెన్నిస్ ప్లేయర్ హత్య కేసు.. వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు!
తాజావార్తలు
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
-
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
-
Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
-
AI Robot: మునిగిపోతున్న వారిని రక్షించే ఏఐ రోబోట్ ప్రయోగం విజయవంతం
-
OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!