Kaleshwaram Projcet : కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
- కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వ కొత్త అడుగు
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బుంగల వెలుగు – ఎన్డీఎస్యే సూచనలు
- ఐఐటీ రూర్కీ నివేదికపై వెనక్కి అడుగు వేసిన అధికారులు
- జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీలకు దరఖాస్తుల ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Projcet : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఈ పనుల కోసం కొత్త డిజైన్లు అవసరమని నిర్ణయించి, కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తూ నీటిపారుదల శాఖకు చెందిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ డిజైన్లు తప్పనిసరిగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్యే) సూచనలు, దర్యాప్తు నివేదిక ఆధారంగా ఉండాలని స్పష్టంగా పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలి. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు పరిశీలన జరగనుంది. సమర్పించిన ప్రతిపాదనలను ప్రభుత్వం సీల్డ్ కవర్లో భద్రపరచనుంది.
Jubilee Hills By-Election: ఆ తర్వాతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన..!
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో పియర్స్ కుంగిపోవడం. అనంతరం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కూడా బుంగలు బయటపడటంతో ఈ ప్రాజెక్ట్ భద్రతపై తీవ్రమైన అనుమానాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్డీఎస్యే సహాయం కోరగా, సంస్థ పలు సూచనలు చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకొని పునరుద్ధరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.
మొదట మేడిగడ్డ సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు అధికారులు డిజైన్ల కోసం ఐఐటీ రూర్కీ సహకారం పొందాలని భావించారు. అప్పట్లో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కూడా ఐఐటీ రూర్కీతో అధ్యయనం చేయించి నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికలోని అనేక అంశాలను ఎన్డీఎస్యే తిరస్కరించడంతో ప్రభుత్వం కొత్త ఆలోచనలోకి వెళ్ళింది.
దాంతో ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థల సహకారం తీసుకోవాలని సీడీవో నిర్ణయించింది. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించేందుకు నీటిపారుదల శాఖ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఈ నిర్ణయం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్లోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు శాస్త్రీయ దృక్పథం, నిపుణుల సహకారం లభించనుంది.
Cyclone Effect: విశాఖపై వాయుగుండం ఎఫెక్ట్.. భీకర గాలులతో అతలాకుతలం..!
తాజావార్తలు
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
ట్రెండింగ్
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!