Kaleshwaram Projcet : కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
- కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వ కొత్త అడుగు
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బుంగల వెలుగు – ఎన్డీఎస్యే సూచనలు
- ఐఐటీ రూర్కీ నివేదికపై వెనక్కి అడుగు వేసిన అధికారులు
- జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీలకు దరఖాస్తుల ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Projcet : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఈ పనుల కోసం కొత్త డిజైన్లు అవసరమని నిర్ణయించి, కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తూ నీటిపారుదల శాఖకు చెందిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ డిజైన్లు తప్పనిసరిగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్యే) సూచనలు, దర్యాప్తు నివేదిక ఆధారంగా ఉండాలని స్పష్టంగా పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలి. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు పరిశీలన జరగనుంది. సమర్పించిన ప్రతిపాదనలను ప్రభుత్వం సీల్డ్ కవర్లో భద్రపరచనుంది.
Jubilee Hills By-Election: ఆ తర్వాతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన..!
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో పియర్స్ కుంగిపోవడం. అనంతరం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కూడా బుంగలు బయటపడటంతో ఈ ప్రాజెక్ట్ భద్రతపై తీవ్రమైన అనుమానాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్డీఎస్యే సహాయం కోరగా, సంస్థ పలు సూచనలు చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకొని పునరుద్ధరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.
మొదట మేడిగడ్డ సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు అధికారులు డిజైన్ల కోసం ఐఐటీ రూర్కీ సహకారం పొందాలని భావించారు. అప్పట్లో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కూడా ఐఐటీ రూర్కీతో అధ్యయనం చేయించి నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికలోని అనేక అంశాలను ఎన్డీఎస్యే తిరస్కరించడంతో ప్రభుత్వం కొత్త ఆలోచనలోకి వెళ్ళింది.
దాంతో ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థల సహకారం తీసుకోవాలని సీడీవో నిర్ణయించింది. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించేందుకు నీటిపారుదల శాఖ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఈ నిర్ణయం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్లోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు శాస్త్రీయ దృక్పథం, నిపుణుల సహకారం లభించనుంది.
Cyclone Effect: విశాఖపై వాయుగుండం ఎఫెక్ట్.. భీకర గాలులతో అతలాకుతలం..!
తాజావార్తలు
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!