K.A Paul: లక్ష ఓట్లు పడ్డాయి అది అందరికీ తెలుసు అది మీక్కూడా తెలుసు అంటూ ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. ఇది కేవలం అవినీతి ఎలక్షన్స్అని అన్నారు. ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిందని అన్నారు. వందల వేల కోట్లు పంచడం మీరే చూసారు కదా బీజేపీది 25 కోట్లు.. టీఆర్ఎస్ 3వేలకోట్లు పంపిణీ జరిగిందని ఆరోపించారు. 30, 20 కోట్లు మాత్రమే సీజ్ చేశారని అని అన్నారు. దీని అర్థం ఏంటి అని ప్రశ్నించారు కేఏ.పాల్. ఓపెన్ గా మందు, ముక్క పంపిణీ చేసినప్పటికి ఇంత క్లియర్ గా అవినీతి జరుగుతున్నదని మీకు తెలుసుకదా అన్నారు. దీనిని రద్దు చేయాలని కోరుకుంటున్నానని డిమాండ్ చేశారు కేఏ పాల్. ఇప్పటి వరకు మాకు 100ఓట్లు కూడా రాలేదని అన్నారు. ఇదంతా ఈవీఎంల కుట్ర అని అర్థమవుతుంది. మేము మినిమం 30వేల నుంచి 50 వేల మెజార్టీతో గెలుస్తామనుకున్నా కానీ 100 ఓట్లు కూడా రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ అంతా టీఆర్ఎస్ తొత్తులు వున్నారని ఆరోపించారు. రిటర్నింగ్ ఆఫీసర్ నన్ను బయటికి పొమ్మన్నాడు నేనే అతన్ని పైకి పంపిస్తా అన్నాడు. మళ్లీ నాదగ్గరకు వచ్చి సపోర్ట్ చేస్తాడట ఇప్పుడేం చేస్తాడు ఆయన అంటూ ఫైర్ అయ్యారు.
మునుగోడు ఉప ఎన్నికలు రద్దు చెయ్యాలి – కే ఏ పాల్#KAPaul #MunugodeBypoll #TRS #BJP #CONGRESS #Munugodu #Telangana #ElectionsWithNTV #ResultsWithNTV #NTVTelugu pic.twitter.com/rhjA2lZDlq
— NTV Telugu (@NtvTeluguLive) November 6, 2022
ముందు జగన్నాత్, ఇప్పుడు రోహిత్ సింగ్ వీళ్లంతా టీఆర్ఎస్ , బీజేపీ ఎజెంట్లు అంటూ మండిపడ్డారు. ఈరెండు పార్టీలు కుమ్మక్కై అవినీతి జరిగింది. ఇప్పుడు బీజేపీకి కొంచెం టీఆర్ఎస్ కు లీడ్ ఇచ్చి బీజేపీ ఈవీఎంలతో ట్యాంపర్ చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. నాకు మినిమం 30 వేల నుంచి 40 వేల మెజారిటీ ఉంటుంది ప్రతి ఛానల్ లో నాకు 50 వేల మెజారిటీ వచ్చింది ఎందుకు అని … అలాంటి యూత్, స్టూడెంట్, లక్షమంది ప్రజలు తన వైపు వున్నాయని ప్లీస్ డిసప్పాయింట్ అవకండని కేఏపాల్ తెలిపారు. కొద్ది నిమిషాల తరువాత మాట్లాడుతా.. క్లారిటీ రానివ్వండి అంటూ కే.ఏ.పాల్ వెళ్లిపోయారు. అయితే.. దీనిపై కే.ఏ.పాల్ పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆయనకు కనీసం 100 కూడా రాకపోవడంతో.. క్రికెట్లో రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు కొడతాడా! అంటూ ట్రోల్ చేస్తున్నారు. కే.ఏ.పాల్ పై భారీగా బెట్టింగులు చేస్తూ క్రికెట్లో రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు కొడతాడా! అంటూ కే.ఏ.పాల్ అంటూ సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక నాలుగు రౌండ్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే సరికి కేఏ పాల్కు 174 ఓట్లు వచ్చాయి.