K.A Paul: తరువాత మాట్లాడుతా.. క్లారిటీ రానివ్వండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K.A Paul: లక్ష ఓట్లు పడ్డాయి అది అందరికీ తెలుసు అది మీక్కూడా తెలుసు అంటూ ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. ఇది కేవలం అవినీతి ఎలక్షన్స్అని అన్నారు. ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిందని అన్నారు. వందల వేల కోట్లు పంచడం మీరే చూసారు కదా బీజేపీది 25 కోట్లు.. టీఆర్ఎస్ 3వేలకోట్లు పంపిణీ జరిగిందని ఆరోపించారు. 30, 20 కోట్లు మాత్రమే సీజ్ చేశారని అని అన్నారు. దీని అర్థం ఏంటి అని ప్రశ్నించారు కేఏ.పాల్. ఓపెన్ గా మందు, ముక్క పంపిణీ చేసినప్పటికి ఇంత క్లియర్ గా అవినీతి జరుగుతున్నదని మీకు తెలుసుకదా అన్నారు. దీనిని రద్దు చేయాలని కోరుకుంటున్నానని డిమాండ్ చేశారు కేఏ పాల్. ఇప్పటి వరకు మాకు 100ఓట్లు కూడా రాలేదని అన్నారు. ఇదంతా ఈవీఎంల కుట్ర అని అర్థమవుతుంది. మేము మినిమం 30వేల నుంచి 50 వేల మెజార్టీతో గెలుస్తామనుకున్నా కానీ 100 ఓట్లు కూడా రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ అంతా టీఆర్ఎస్ తొత్తులు వున్నారని ఆరోపించారు. రిటర్నింగ్ ఆఫీసర్ నన్ను బయటికి పొమ్మన్నాడు నేనే అతన్ని పైకి పంపిస్తా అన్నాడు. మళ్లీ నాదగ్గరకు వచ్చి సపోర్ట్ చేస్తాడట ఇప్పుడేం చేస్తాడు ఆయన అంటూ ఫైర్ అయ్యారు.
మునుగోడు ఉప ఎన్నికలు రద్దు చెయ్యాలి – కే ఏ పాల్#KAPaul #MunugodeBypoll #TRS #BJP #CONGRESS #Munugodu #Telangana #ElectionsWithNTV #ResultsWithNTV #NTVTelugu pic.twitter.com/rhjA2lZDlq
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
— NTV Telugu (@NtvTeluguLive) November 6, 2022
ముందు జగన్నాత్, ఇప్పుడు రోహిత్ సింగ్ వీళ్లంతా టీఆర్ఎస్ , బీజేపీ ఎజెంట్లు అంటూ మండిపడ్డారు. ఈరెండు పార్టీలు కుమ్మక్కై అవినీతి జరిగింది. ఇప్పుడు బీజేపీకి కొంచెం టీఆర్ఎస్ కు లీడ్ ఇచ్చి బీజేపీ ఈవీఎంలతో ట్యాంపర్ చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. నాకు మినిమం 30 వేల నుంచి 40 వేల మెజారిటీ ఉంటుంది ప్రతి ఛానల్ లో నాకు 50 వేల మెజారిటీ వచ్చింది ఎందుకు అని … అలాంటి యూత్, స్టూడెంట్, లక్షమంది ప్రజలు తన వైపు వున్నాయని ప్లీస్ డిసప్పాయింట్ అవకండని కేఏపాల్ తెలిపారు. కొద్ది నిమిషాల తరువాత మాట్లాడుతా.. క్లారిటీ రానివ్వండి అంటూ కే.ఏ.పాల్ వెళ్లిపోయారు. అయితే.. దీనిపై కే.ఏ.పాల్ పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆయనకు కనీసం 100 కూడా రాకపోవడంతో.. క్రికెట్లో రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు కొడతాడా! అంటూ ట్రోల్ చేస్తున్నారు. కే.ఏ.పాల్ పై భారీగా బెట్టింగులు చేస్తూ క్రికెట్లో రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు కొడతాడా! అంటూ కే.ఏ.పాల్ అంటూ సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక నాలుగు రౌండ్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే సరికి కేఏ పాల్కు 174 ఓట్లు వచ్చాయి.
తాజావార్తలు
-
T20 World Cup : ఆస్ట్రేలియా కాదు, ఇంగ్లాండ్ కాదు.. ఇండియాని వణికిస్తున్న జట్టు ఇదే!
-
Vijay Birthday : రూ.70లక్షలు, 15 లారీలు.. విజయ్ జీవితాన్ని మలుపుతిప్పిన రోజు!
-
Vaibhav suryavanshi: 2026 “వైభవ్” నామ సంవత్సరం.. వామ్మో 7 నెలల్లో ఇన్ని రికార్డులా?
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!