NTV Telugu Site icon

Jogu Ramanna: బీజేపీ నేతలపై జోగురామన్న ఫైర్.. మా సొమ్ము.. మీది సోకు అంటూ సెటైర్‌

Jogu Ramanna

Jogu Ramanna

Jogu Ramanna: బీజేపీ నేతల పై ఎమ్మెల్యే జోగు రామన్న ఫైర్ అయ్యారు. మా సొమ్ము అయితే మీది సోకులు అంటూ సెటైర్‌ వేశారు. ఢిల్లీ లో ఏక్ నంబర్ బామ్టే ఆదిలాబాద్ లో సాత్ నంబర్ బామ్టే లున్నారన్నారు. అప్పులు చేసి అయినా మేము అభివృద్ధి పనులు చేశాము.. మీరు చేశారా? అంటూ ప్రశ్నించారు. 8 మంది ప్రధాన మంత్రులు చేసిన దానికంటే ఎక్కువ అప్పులు ఒక్క మోడీ చేశాడన్నారు. రాష్ట్రంకు రావాల్సిన నిధుల విషయంలో కేటీఆర్ సవాల్ విసిరితే బీజేపీ నేతలు స్పందించ లేదని ఎద్దేవ చేశారు. మోడీ ప్రభుత్వం 9 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. ఉన్న ఉద్యోగాలు ఊడపికారంటూ మండిపడ్డారు. మా సొమ్ము… మీది సోకంటూ .. ప్రతి వ్యక్తి మీద లక్షన్నర అప్పు పెట్టారని అన్నారు. జీరో అకౌంట్ డబ్బులు ఏవి? అంటూ ప్రశ్నించారు. సిలిండర్ ధర పెంచారని, ఏడాది కి రెండు కోట్ల ఉద్యోగాలు అని యూత్ ను మోసం చేసారని గుర్తుచేశారు.

Read also: Road Accident: బస్సు ట్రక్కు ఢీ.. 10 మంది సాయి భక్తులు మృతి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారి పోయావ్ అంటూ వ్యంగ్రాస్త్రం వేశారు. బీఆర్‌ఎస్‌ పెడితే బీజేపీ నేతల లాగులు తడుస్తున్నాయని చురకలంటించారు. మా పార్టీ పేరు ఏదున్నా డీ.ఎన్.ఏ అదే అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే బీజేపీ నేతలు భయ పడుతున్నారని అన్నారు. జై శ్రీరామ్ అంటే సరిపోదు. జై శ్రీరామ్ అని ఉద్యోగాలు ఇవ్వక పొతే ఊరుకుంటారా? అంటూ ఆరోపించారు. బీజేపీ నేతల లోపాలను బయట పెట్టండి.. కార్యకర్తలకు రామన్న పిలుపన్నారు. బీజేపీ నేతలు పారిపోవాలన్నారు. పొద్దు పొడిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భూముల కబ్జాలు చేసే మనిషి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అంటూ ఆరోపించారు. ఇంకో బీజేపీ నేత ఆదిలాబాద్ కే.ఏ.పాల్ అంటూ సంచలన వ్యాక్యలు చేశారు. కబ్జాలు చేసే లీడర్లు కావాలా? జనంకు సేవ చేసే నాయకులు కావాలో జనం తెల్చు కుంటారని జోగురామన్న అన్నారు.
Traffic Jam: టోల్​ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్​ టైంవేస్ట్ చేసుకోవద్దన్న సజ్జనార్​