Peddapalli: ట్రాన్స్ జెండర్ గా మారిన వారికి ‘జల్సా’ ఈవెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddapalli: ట్రాన్స్ అంటేనే అంటరాని వారిగా చూస్తారు చాలామంది. వారిని చూసిన వారు అసహ్యించు కుంటుంటారు. బస్టాండ్ లలో రైళ్లలో, బస్సులో చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతూ వారి జీవనం సాగిస్తుంటారు. వీరిక్కూడా మనసుంటుందని, కుటుంబాలకు దూరమై బాధతో బతుకుతుంటారని మాత్రం ఎవరూ ఊహించలేరు. అయితే వీల్లందరూ ఒక చోట కలిస్తే పండుగ వాతావరణమనే చెప్పాలి. వీరు కూడా ఈవెంట్ లు చేసుకుంటారని మీకు తెలుసా. దానిపేరే జల్సా ఈవెంట్. ఇదేదో పవన్ కళ్యాణ్ మువీ అనుకుంటే పప్పులో కాలువేసినట్లే. జెండర్స్ మారిన వ్యక్తులను ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో జల్సా ఈవెంట్ చేస్తారు. దీనినే జల్సా అంటారు. ఇది ఎక్కడో కాదండోయ్ తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఈ పండుగ వాతావరణం జరుపుకున్నారు.
Read also: బిర్యానీ అసలు పేరేంటో ఎప్పుడైనా ఆలోచించారా?
Also Read
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జల్సా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి ట్రాన్స్ జెండర్స్ కమిటీ హాజరై జల్సా వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అందరూ కలిసి ఆట పాటలతో డ్యాన్స్ చేస్తూ పండగ వాతావరణాన్ని సృష్టించుకుని, కలిసి భోజనాలు తింటారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ గా సర్జరీ చేయించుకుని 41 రోజులు ఇంట్లో విశ్రాంతి తీసున్న తర్వాత తమ కుల దైవమైన అమ్మవారికి పూజ నిర్వహించి ఆ తర్వాత ట్రాన్స్ జెండర్ గా మారిన వారికి ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందనీ దీన్నే ‘జల్సా’ పేరిట కార్యక్రమం నిర్వహహిస్తామని ఈ ఈవెంట్ కు రాష్ట్ర స్థాయి ట్రాన్స్ జెండర్స్ హాజరై ట్రాన్స్ జెండర్ గా మారిన వాళ్ళను ఆశీర్వదిస్తారని అన్నారు. ఆడవాళ్లకు సారీ ఫంక్షన్ ఎలాగో మాకు ఈ జల్సా పేరిట నిర్వహించే ఈవెంట్ చాలా ప్రాముఖ్యతను ఇస్తామని అన్నారు.
Read also: Bandi Sanjay: కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖలోనే..
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే ట్రాన్స్జెండర్గా మారిన విషయం తెలిసిందే. దీపికా పదుకొనే, అనుష్క శర్మ, కరీనా కపూర్ వంటి ప్రముఖులకు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేశాడు. తన పేరును ‘సైషా’గా మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. “నేను స్వలింగ సంపర్కురాలిని కాదు… కానీ ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ని” అని ఆమె చెప్పుకొచ్చారు. కొద్దినెలల క్రితం తాను మగవాళ్లంటే ఇంట్రెస్ట్ చూపించేవాడినని, కాలేజీ రోజుల్లో అందరూ తనను అదోమాదిరిగా చూసేసరికి చాలా బాధపడ్డానని సైషా వెల్లడించింది. 20 ఏళ్ల వయసులో నిఫ్ట్లో ఉన్నప్పుడు ఆరేళ్ల క్రితం జరిగిన సంఘటనలేమిటో తెలుసుకునే సాహసం చేశానని, రియాలిటీలో జీవించడం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా అనిపిస్తోందని వివరించిన విషయం తెలిసిందే..
Telangana: తెలంగాణలో మళ్లీ మండుతున్న ఎండలు..
తాజావార్తలు
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!