Peddapalli: ట్రాన్స్ జెండర్ గా మారిన వారికి ‘జల్సా’ ఈవెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddapalli: ట్రాన్స్ అంటేనే అంటరాని వారిగా చూస్తారు చాలామంది. వారిని చూసిన వారు అసహ్యించు కుంటుంటారు. బస్టాండ్ లలో రైళ్లలో, బస్సులో చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతూ వారి జీవనం సాగిస్తుంటారు. వీరిక్కూడా మనసుంటుందని, కుటుంబాలకు దూరమై బాధతో బతుకుతుంటారని మాత్రం ఎవరూ ఊహించలేరు. అయితే వీల్లందరూ ఒక చోట కలిస్తే పండుగ వాతావరణమనే చెప్పాలి. వీరు కూడా ఈవెంట్ లు చేసుకుంటారని మీకు తెలుసా. దానిపేరే జల్సా ఈవెంట్. ఇదేదో పవన్ కళ్యాణ్ మువీ అనుకుంటే పప్పులో కాలువేసినట్లే. జెండర్స్ మారిన వ్యక్తులను ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో జల్సా ఈవెంట్ చేస్తారు. దీనినే జల్సా అంటారు. ఇది ఎక్కడో కాదండోయ్ తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఈ పండుగ వాతావరణం జరుపుకున్నారు.
Read also: బిర్యానీ అసలు పేరేంటో ఎప్పుడైనా ఆలోచించారా?
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జల్సా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి ట్రాన్స్ జెండర్స్ కమిటీ హాజరై జల్సా వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అందరూ కలిసి ఆట పాటలతో డ్యాన్స్ చేస్తూ పండగ వాతావరణాన్ని సృష్టించుకుని, కలిసి భోజనాలు తింటారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ గా సర్జరీ చేయించుకుని 41 రోజులు ఇంట్లో విశ్రాంతి తీసున్న తర్వాత తమ కుల దైవమైన అమ్మవారికి పూజ నిర్వహించి ఆ తర్వాత ట్రాన్స్ జెండర్ గా మారిన వారికి ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందనీ దీన్నే ‘జల్సా’ పేరిట కార్యక్రమం నిర్వహహిస్తామని ఈ ఈవెంట్ కు రాష్ట్ర స్థాయి ట్రాన్స్ జెండర్స్ హాజరై ట్రాన్స్ జెండర్ గా మారిన వాళ్ళను ఆశీర్వదిస్తారని అన్నారు. ఆడవాళ్లకు సారీ ఫంక్షన్ ఎలాగో మాకు ఈ జల్సా పేరిట నిర్వహించే ఈవెంట్ చాలా ప్రాముఖ్యతను ఇస్తామని అన్నారు.
Read also: Bandi Sanjay: కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖలోనే..
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే ట్రాన్స్జెండర్గా మారిన విషయం తెలిసిందే. దీపికా పదుకొనే, అనుష్క శర్మ, కరీనా కపూర్ వంటి ప్రముఖులకు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేశాడు. తన పేరును ‘సైషా’గా మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. “నేను స్వలింగ సంపర్కురాలిని కాదు… కానీ ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ని” అని ఆమె చెప్పుకొచ్చారు. కొద్దినెలల క్రితం తాను మగవాళ్లంటే ఇంట్రెస్ట్ చూపించేవాడినని, కాలేజీ రోజుల్లో అందరూ తనను అదోమాదిరిగా చూసేసరికి చాలా బాధపడ్డానని సైషా వెల్లడించింది. 20 ఏళ్ల వయసులో నిఫ్ట్లో ఉన్నప్పుడు ఆరేళ్ల క్రితం జరిగిన సంఘటనలేమిటో తెలుసుకునే సాహసం చేశానని, రియాలిటీలో జీవించడం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా అనిపిస్తోందని వివరించిన విషయం తెలిసిందే..
Telangana: తెలంగాణలో మళ్లీ మండుతున్న ఎండలు..
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?