Peddapalli: ట్రాన్స్ జెండర్ గా మారిన వారికి ‘జల్సా’ ఈవెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddapalli: ట్రాన్స్ అంటేనే అంటరాని వారిగా చూస్తారు చాలామంది. వారిని చూసిన వారు అసహ్యించు కుంటుంటారు. బస్టాండ్ లలో రైళ్లలో, బస్సులో చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతూ వారి జీవనం సాగిస్తుంటారు. వీరిక్కూడా మనసుంటుందని, కుటుంబాలకు దూరమై బాధతో బతుకుతుంటారని మాత్రం ఎవరూ ఊహించలేరు. అయితే వీల్లందరూ ఒక చోట కలిస్తే పండుగ వాతావరణమనే చెప్పాలి. వీరు కూడా ఈవెంట్ లు చేసుకుంటారని మీకు తెలుసా. దానిపేరే జల్సా ఈవెంట్. ఇదేదో పవన్ కళ్యాణ్ మువీ అనుకుంటే పప్పులో కాలువేసినట్లే. జెండర్స్ మారిన వ్యక్తులను ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో జల్సా ఈవెంట్ చేస్తారు. దీనినే జల్సా అంటారు. ఇది ఎక్కడో కాదండోయ్ తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఈ పండుగ వాతావరణం జరుపుకున్నారు.
Read also: బిర్యానీ అసలు పేరేంటో ఎప్పుడైనా ఆలోచించారా?
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
- Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జల్సా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి ట్రాన్స్ జెండర్స్ కమిటీ హాజరై జల్సా వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అందరూ కలిసి ఆట పాటలతో డ్యాన్స్ చేస్తూ పండగ వాతావరణాన్ని సృష్టించుకుని, కలిసి భోజనాలు తింటారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ గా సర్జరీ చేయించుకుని 41 రోజులు ఇంట్లో విశ్రాంతి తీసున్న తర్వాత తమ కుల దైవమైన అమ్మవారికి పూజ నిర్వహించి ఆ తర్వాత ట్రాన్స్ జెండర్ గా మారిన వారికి ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందనీ దీన్నే ‘జల్సా’ పేరిట కార్యక్రమం నిర్వహహిస్తామని ఈ ఈవెంట్ కు రాష్ట్ర స్థాయి ట్రాన్స్ జెండర్స్ హాజరై ట్రాన్స్ జెండర్ గా మారిన వాళ్ళను ఆశీర్వదిస్తారని అన్నారు. ఆడవాళ్లకు సారీ ఫంక్షన్ ఎలాగో మాకు ఈ జల్సా పేరిట నిర్వహించే ఈవెంట్ చాలా ప్రాముఖ్యతను ఇస్తామని అన్నారు.
Read also: Bandi Sanjay: కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖలోనే..
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే ట్రాన్స్జెండర్గా మారిన విషయం తెలిసిందే. దీపికా పదుకొనే, అనుష్క శర్మ, కరీనా కపూర్ వంటి ప్రముఖులకు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేశాడు. తన పేరును ‘సైషా’గా మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. “నేను స్వలింగ సంపర్కురాలిని కాదు… కానీ ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ని” అని ఆమె చెప్పుకొచ్చారు. కొద్దినెలల క్రితం తాను మగవాళ్లంటే ఇంట్రెస్ట్ చూపించేవాడినని, కాలేజీ రోజుల్లో అందరూ తనను అదోమాదిరిగా చూసేసరికి చాలా బాధపడ్డానని సైషా వెల్లడించింది. 20 ఏళ్ల వయసులో నిఫ్ట్లో ఉన్నప్పుడు ఆరేళ్ల క్రితం జరిగిన సంఘటనలేమిటో తెలుసుకునే సాహసం చేశానని, రియాలిటీలో జీవించడం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా అనిపిస్తోందని వివరించిన విషయం తెలిసిందే..
Telangana: తెలంగాణలో మళ్లీ మండుతున్న ఎండలు..
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!