BRS Leader Jai congress Slogans: బీఆర్ఎస్ నేత నోట …జై కాంగ్రెస్ నినాదాల మాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో ఏడాదికో పార్టీ మారుతున్నారు. అయితే తామేం పార్టీలో ఉన్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో వారికి గుర్తుకురావడం లేదు. ఒక్కోసారి ప్రత్యర్థి పార్టీకి జై కొట్టడం అలవాటులో పొరపాటుగా జరిగిపోతుంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అదే జరిగింది. ఎమ్మెల్యే రమణ రెడ్డి అనుచరులు ఇంకా బీఆర్ ఎస్ పార్టీని ఒంట ఓట్టించుకోలేదు. ఇప్పటికీ ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆయన అనుచరాలు జై కాంగ్రెస్ అని అంటూనే ఉన్నారు. వారి నినాదాలు విని పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతూనే వుంది.
Read Also: CM KCR : కైకాల విలక్షణ నటుడు.. కొంతకాలం మేము కలసి పని చేశాం
Also Read
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
తాజాగా ఉపాధి హామీ పనులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై వ్యవహరిస్తున్న కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సభను ఉత్తేజపరిచేందుకుగాను నినాదాలు ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు అంతా గులాబీ బట్టలేసుకున్నారు. జై బీఆర్ఎస్ కు బదులుగా జై కాంగ్రెస్ అని పలకడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
జై బీఆర్ఎస్ అని అనడానికి బదులు రేగొండ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పెట్టేం శంకర్ జై కాంగ్రెస్ అంటూ నినదించారు. అక్కడ ఉన్న మిగతా నేతలు జరిగిన పొరపాటును అతని దృష్టికి తేవడంతో నాలిక్కరుచుకుని మళ్లీ జై బీఆర్ఎస్, బీజేపీ నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. జై బీఆర్ఎస్ పార్టీ అనడానికి బదులుగా జై కాంగ్రెస్ అని అనడంతో రమణారెడ్డి అనుచరులకు పాత వాసనలు పోలేదని జనం చెవులు కొరుక్కున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!