NTV Telugu Site icon

Ponguleti: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

Ponguleti

Ponguleti

Ponguleti: పాలేరు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయంలో గురువారం ఉదయం ఐటీ సోదాలు జరిగాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు 8 వాహనాల్లో వచ్చారు. ఇది జరుగుతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల క్రితమే చెప్పారు. ఖమ్మంలోని పొంగులేటి ఇంటి కార్యాలయాలను తనిఖీ చేస్తున్న ఐటీ శాఖ అధికారులు. పొంగులేటి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో పొంగులేటి కుటుంబ సభ్యులంతా ఖమ్మంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. తెల్లవారుజామున 4:30 గంటలకు వచ్చిన ఐటీ అధికారులు వారందరి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి అనుచరుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాలేరు, హైదరాబాద్‌లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసాలపై ఉదయం 6 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డింగ్స్‌లోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి రాఘవ్‌ కన్‌స్ట్రక్షన్‌ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరాడు. అయితే తనకు ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో పొంగులేటి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి పాలేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జరుగుతుండటం గమనార్హం. ఈ క్రమంలో తనపై కూడా ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి రెండు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే జరుగుతుంది.పాలేరు, హైదరాబాద్‌లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసాలపై ఉదయం 6 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డింగ్స్‌లోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి.

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?