Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hydra Ftl Houses Commissioner Ranganath Statement Compensation Hyderabad Flood Risk

Hydraa : FTL ఇళ్లపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు.. కూల్చివేతలు ఉండవు.!

Published Date :January 27, 2026 , 7:29 pm
By Gogikar Sai Krishna
  • రాయసముద్రం చెరువు పరిశీలన - ప్రజల్లో చర్చ
  • FTL పరిధిలోని ఇళ్లపై రంగనాథ్ హామీ
  • అలుగు ప్రవాహ అడ్డంకులపై కఠిన చర్యలు
  • నష్టపరిహారం - వరద ముప్పు నివారణే లక్ష్యం
Hydraa : FTL ఇళ్లపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు.. కూల్చివేతలు ఉండవు.!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని రాయసముద్రం చెరువును హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ స్వయంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న పరిణామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అటు బాధితుల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. గత కొంతకాలంగా హైడ్రా అంటేనే కూల్చివేతలు అనే ఒక బలమైన ముద్ర పడటంతో, సామాన్యులు తమ ఇళ్ల పరిస్థితి ఏంటో అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ గారు చేసిన ప్రకటనలు ప్రజలకు కొంత ఊరటనిచ్చేలా ఉన్నాయి.

రాయసముద్రం చెరువు పరిశీలనలో భాగంగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో హైడ్రా గురించి జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఎఫ్.టి.ఎల్  పరిధిలో ఇప్పటికే నిర్మించబడి, ప్రజలు నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. హైడ్రా రంగంలోకి దిగగానే ఇళ్లను నేలమట్టం చేస్తుందనే భయాన్ని ప్రజల మనసుల్లో నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. నిబంధనల ప్రకారం చెరువుల రక్షణ ముఖ్యం అయినప్పటికీ, సామాన్యులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read

  • Women Commission : తెలంగాణ మహిళా కమిషన్‌లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
  • CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
  • Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
  • HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
Add as a preferred
source on google

Pakistan: పాకిస్థాన్ సైన్యం దృష్టిలో మరొక పార్టీ.. అదే సీన్ రిపీట్ అవుతుందా?

చెరువుల విషయంలో హైడ్రా ప్రధాన లక్ష్యం వరద ముప్పును నివారించడం. ఇందులో భాగంగా చెరువు అలుగు (Sluice) ప్రవాహానికి అడ్డంగా ఉన్న నిర్మాణాల పట్ల కఠినంగా ఉండక తప్పదని ఆయన వివరించారు. ఒకవేళ అలుగు ప్రవాహానికి అడ్డంగా ఉండి, నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుంటే.. అలాంటి ఇళ్లను తొలగించడం తప్పనిసరి అవుతుందని చెప్పారు. అయితే, ఇలాంటి సందర్భాల్లో ఇళ్లను కోల్పోయే వారికి ప్రభుత్వం తరపున తగిన నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. ఒకటి రెండు ఇళ్ల కోసం మొండిగా వ్యవహరిస్తే, భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు నీట మునిగి ఇబ్బంది పడాల్సి వస్తుందని, అలాంటి విపత్తును ఆపడమే హైడ్రా ప్రాధాన్యత అని వివరించారు.

హైడ్రా తీసుకునే ప్రతి చర్య వెనుక ప్రజా ప్రయోజనం దాగి ఉంటుందని రంగనాథ్ తన పర్యటనలో నొక్కి చెప్పారు. లక్షలాది మంది ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, కానీ అవి ఎప్పుడూ చట్టబద్ధంగా , మానవతా దృక్పథంతోనే ఉంటాయని భరోసా ఇచ్చారు. చెరువుల పునరుద్ధరణ , నాలాల ఆక్రమణల తొలగింపు ద్వారా నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడటమే తమ అంతిమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ADG Mahesh Bhagwat : నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు.. రూల్స్ ఇలా..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • compensation
  • Discover News
  • encroachments
  • FTL
  • Hyderabad flood

తాజావార్తలు

  • PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!

  • Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions