Hydraa : FTL ఇళ్లపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు.. కూల్చివేతలు ఉండవు.!
- రాయసముద్రం చెరువు పరిశీలన - ప్రజల్లో చర్చ
- FTL పరిధిలోని ఇళ్లపై రంగనాథ్ హామీ
- అలుగు ప్రవాహ అడ్డంకులపై కఠిన చర్యలు
- నష్టపరిహారం - వరద ముప్పు నివారణే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని రాయసముద్రం చెరువును హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ స్వయంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న పరిణామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అటు బాధితుల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. గత కొంతకాలంగా హైడ్రా అంటేనే కూల్చివేతలు అనే ఒక బలమైన ముద్ర పడటంతో, సామాన్యులు తమ ఇళ్ల పరిస్థితి ఏంటో అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ గారు చేసిన ప్రకటనలు ప్రజలకు కొంత ఊరటనిచ్చేలా ఉన్నాయి.
రాయసముద్రం చెరువు పరిశీలనలో భాగంగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో హైడ్రా గురించి జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఇప్పటికే నిర్మించబడి, ప్రజలు నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. హైడ్రా రంగంలోకి దిగగానే ఇళ్లను నేలమట్టం చేస్తుందనే భయాన్ని ప్రజల మనసుల్లో నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. నిబంధనల ప్రకారం చెరువుల రక్షణ ముఖ్యం అయినప్పటికీ, సామాన్యులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
Pakistan: పాకిస్థాన్ సైన్యం దృష్టిలో మరొక పార్టీ.. అదే సీన్ రిపీట్ అవుతుందా?
చెరువుల విషయంలో హైడ్రా ప్రధాన లక్ష్యం వరద ముప్పును నివారించడం. ఇందులో భాగంగా చెరువు అలుగు (Sluice) ప్రవాహానికి అడ్డంగా ఉన్న నిర్మాణాల పట్ల కఠినంగా ఉండక తప్పదని ఆయన వివరించారు. ఒకవేళ అలుగు ప్రవాహానికి అడ్డంగా ఉండి, నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుంటే.. అలాంటి ఇళ్లను తొలగించడం తప్పనిసరి అవుతుందని చెప్పారు. అయితే, ఇలాంటి సందర్భాల్లో ఇళ్లను కోల్పోయే వారికి ప్రభుత్వం తరపున తగిన నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. ఒకటి రెండు ఇళ్ల కోసం మొండిగా వ్యవహరిస్తే, భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు నీట మునిగి ఇబ్బంది పడాల్సి వస్తుందని, అలాంటి విపత్తును ఆపడమే హైడ్రా ప్రాధాన్యత అని వివరించారు.
హైడ్రా తీసుకునే ప్రతి చర్య వెనుక ప్రజా ప్రయోజనం దాగి ఉంటుందని రంగనాథ్ తన పర్యటనలో నొక్కి చెప్పారు. లక్షలాది మంది ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, కానీ అవి ఎప్పుడూ చట్టబద్ధంగా , మానవతా దృక్పథంతోనే ఉంటాయని భరోసా ఇచ్చారు. చెరువుల పునరుద్ధరణ , నాలాల ఆక్రమణల తొలగింపు ద్వారా నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడటమే తమ అంతిమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ADG Mahesh Bhagwat : నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు.. రూల్స్ ఇలా..!
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!