TGSRTC Tour Package: అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
- కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త ..
- వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ 040-23450033- 040-69440000 సంప్రదించగలరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC Tour Package: కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. పరమశివుణి దర్శనం కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని #TGSRTC యాజమాన్యం ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించే సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13 నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు అరుణాచలానికి చేరుకుంటాయి.
Read also: Hemoglobin Levels: మీ రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే జరిగే అనర్థాలు ఇవే
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-23450033, 040-69440000 సంప్రదించగలరని స్పష్టం చేశారు. టికెట్ ధర ఎంత ఉంటుంది అనేది క్లారిటీ ఇవ్వకపోయినా.. ఫోన్ చేస్తే టూర్ ప్యాకేజీ వివరాలు వివరిస్తామని పేర్కొన్నారు. అద్దె ప్రాతిపదికన తీసుకునే ఆర్టీసీ బస్సు చార్జీలను కూడా తగ్గించినట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పల్లె వెలుగు బస్సు కిలోమీటరుకు రూ.11, ఎక్స్ప్రెస్ రూ.7, డీలక్స్ రూ.8 తగ్గిందని, సూపర్ లగ్జరీకి రూ. 6, రాజధాని రూ.7 వరకు తగ్గినట్లు చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని సజ్జనార్ తెలిపారు. ఏపీలో పంచారామాల కోసం ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. 30-40 మంది భక్తులు ఉంటే వారు కోరిన తేదీల్లో పుణ్యక్షేత్రాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Suriya : కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రావట్లేదు..
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!