Telangana Bonalu: తెలంగాణ సంస్కృతిలో బోనాల స్థానం – 600 ఏళ్ల ప్రస్థానం
- తెలంగాణలో నేటి నుంచి ఆషాడ మాసం బోనాలు..
- ఈరోజు గోల్కొండ జగదాంబ అమ్మవారికి మొదటి బోనం..
- తెలంగాణ సంస్కృతిలో బోనాల స్థానం – 600 ఏళ్ల ప్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Bonalu: తెలంగాణ సంస్కృతికి ప్రతీక, అత్యంత వైభవంగా నిర్వహించుకునే ఆషాడ మాస బోనాలు ఈరోజు (జూన్ 26) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బోనాలు జులై 24వ తేదీతో ముగుస్తాయి. ఇక, అమ్మల గన్న అమ్మ, ఆది పరాశక్తికి బోనం నైవేథ్యం సమర్పణను తెలంగాణలో ఓ పండుగలా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా పలు రకాల పూజలు చేస్తారు. . డిల్లెం పల్లెం చప్పుళ్లతో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలతో పాటు పసుపు బండారులు, వేపల సువాసనల నడుమ కల్లు సాకలతో ఆ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనాల ఊరేగింపు సమయంలో నువ్వు పెద్దపులి ఎక్కినావమ్మో అంటూ అందరూ కలిసి ఆడుతూ పాడుతూ చేసే ఆ వేడుకే తెలంగాణ బోనాల జాతరకు ప్రత్యేక ఆకర్షణీయం. దశాబ్దాల చరిత్ర కలిగిన బోనాల జాతర తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైంది.
Read Also: Aashadam Bonalu 2025 : గోల్కొండపై తొలి బోనం.. ఆషాఢ బోనాలకు భక్తి శోభా ఆరంభం!
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
అయితే, ఈరోజు ఆషాడ మాసం తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారికి భక్తులు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ అర్చకులు జగజ్జనని అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో బోనాల పండగ సందడి స్టార్ట్ అవుతుంది. ఇక, జులై 13వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో బోనాలు తీయనున్నారు. వీటినే లష్కర్ బోనాలు అని పిలుస్తారు. జులై 21వ తేదీన లాల్దర్వాజ ఆలయంలో జరిగే రంగం వేడుకలతో హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు ముగుస్తాయి.
Read Also: Akhanda Godavari Project: నేడు ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్కు శంఖుస్థాపన!
ఇక, తెలంగాణలో బోనాల పండగ ఉత్సవాలకు ఎంతో చరిత్ర కలిగి ఉంది. 600 ఏళ్ల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు ఏడుకోళ్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలను సమర్పించుకున్నారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అలాగే, 1676లో సర్వాయి పాపన్న కరీంనగర్ లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారని నానుడి. ఇక, గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచే బోనాలు పండగ జరుగుతుందని.. ఆ తర్వాత గోల్కొండను జయించిన కులీ కుతుబ్ షా, బాదూషా సైతం ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని చరిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తానీషా పాలనలో అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలోనే ఘనంగా గోల్కొండ కోట మొదలు హైదరాబాద్లోని అమ్మవార్లు, గ్రామ దేవతల ఆలయాల్లో బోనాల పండగ సంబరాలు వైభవంగా సాగేవని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. కాగా, బోనాల ఉత్సవాలను కల్లారా చూసి ఆనందంతో పరవశిస్తుంటారు భక్తులు. ఈ జాతర నెల రోజులు తెలంగాణ పుర వీధులు కళకళలాడుతుంటాయి. రాష్ట్రంలోని ప్రతి గడప పచ్చని వేపాకులతో పసుపు గడపలతో ఇంటి ఆడపడులు, పిల్లా పాపలతో కళకళలాడుతు దర్శనమిస్తాయి.
తాజావార్తలు
-
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
-
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!