Minister Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క ఈరోజు రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. గవర్నర్తో భేటీ అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. 2022లో ములుగును మున్సిపాలిటీగా మార్చే బిల్లును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించి గవర్నర్కు పంపింది. ములుగు మున్సిపాలిటీ వ్యవహారం రెండేళ్లుగా పెండింగ్లో ఉంది. ఈ సందర్భంగా ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లులకు ఆమోదం తెలపాలని గవర్నర్ను కోరాం. ఆదిలాబాద్ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి తెలియజేశాం. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్ను కోరాం. ములుగులోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో గవర్నర్ ఉన్నారు. దత్తత గ్రామాల జాబితాను గవర్నర్కు పంపామని, ఆదిలాబాద్ జిల్లా పర్యటనపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సీతక్క పేర్కొన్నారు.
Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తాం..
Minister Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుపై గవర్నర్ జిష్ణు దేవ్ తో సీతక్క భేటీ
- ములుగు మున్సిపాలిటీ వ్యవహారం రెండేళ్లుగా పెండింగ్లో ఉంది..
- బిల్లులకు ఆమోదంపై గవర్నర్ జిష్ణు దేవ్ తో సీతక్క భేటీ..

Minister Seetakka