CM Revanth Reddy: పబ్లిక్ గార్డెన్ లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.. దాశరథి కవితతో సీఎం ప్రసంగం..
- ఓ నిజాము పిశాచమా అన్న దాశరథి కవితతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం..
- రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..
CM Revanth Reddy: ఓ నిజాము పిశాచమా అన్న దాశరథి కవితతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 18న ఆవిష్కృతమైందని తెలిపారు. తెలంగాణ అంటే త్యాగం.. దొడ్డి కొమరయ్య లాంటి మంది వీరులు ఎందరో త్యాగం చేశారన్నారు. సెప్టెంబర్ 17 పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని అన్నారు. కానీ మేము ప్రజా పాలన చేయాలని మేము నిర్ణయించామన్నారు. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది అని తెలిపారు. ఓ నిజాము పిశాచమా అన్న దాశరథి కవితతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభించారు.
Read also: GHMC Office: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..
Also Read
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం, రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు.. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారు.. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు.. ఇది తెలంగాణ ప్రజల విజయం.. ఇందులో రాజకీయాలకు తావులేదు.. సెప్టెంబర్ 17ను కొందరు వివాదాస్పదం చేయడం క్షమించరానిదని తెలిపారు. ఢిల్లీకి పోతే కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ పాకిస్థాన్ లో ఉందా..? అని ప్రశ్నించారు. వ్యక్తిగత పనుల కోసం ఢిల్లీ వెళ్ళడం లేదన్నారు రాష్ట్ర హక్కుల కోసం.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి పోతాం.. లేక్ సిటీ కాస్త.. డ్రగ్స్ సిటిగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల రక్షణకు హైడ్రాను తీసుకొచ్చామన్నారు. ప్రకృతి విపత్తు రాకుండా చూడాలన్నారు. హైడ్రా వెనకాల రాజకీయం లేదని తెలిపారు. కొందరు హైడ్రానీ నీరుకార్చే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ఎవరు అడ్డుకున్నా ఆగదు హైడ్రా.. ప్రజలు సహకరించాలని కోరారు.
Bandlaguda Jagir: ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన బండ్లగూడ గణేష్ లడ్డూ..!
తాజావార్తలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!