Vikarabad Crime: దారుణం.. దళిత మహిళపై ఎస్ఐ చిత్రహింసలు..
- తుపాకీతో కాల్చి చంపేస్తా..
- ఓ కేసు విషయంలో పలుమార్లు దాడి..
- 3 నెలలుగా ఠాణాకు వచ్చిపోతున్న మహిళ..
Vikarabad Crime: షాద్నగర్ లో దళిత మహిళా పై థర్డ్ డిగ్రి ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. కుమారుడి జాడ చెప్పాలని.. లేకుంటే తుపాకీతో కాల్చిచంపుతానని ఎస్ఐ బెది రిస్తున్నాడని ఓ దళిత మహిళ వాపోయింది. మూడు నెలలుగా తనను స్టేషను పిలిపించి చిత్రహింసలు పెడుతున్నాడని కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటన వికారబాద్ లో చోటుచేసుకుంది.
Read also: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్స్టార్..
Also Read
- Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గాకు చెందిన లోహడ నరేష్ కాశీంపూర్ గ్రామానికి మేస్త్రీ పనికోసం వెళ్లి అదే గ్రామానికి చెందిన బాలిక(16)ను ప్రేమించాడు. ఇద్దరూ దళితులే. కొన్ని నెలలు ప్రేమించుకున్న వీరు మే 2న ఇళ్లలోంచి వెళ్లిపోయారు. తన కూతురిని నరేష్ కిడ్నాప్ చేశాడని యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నరేష్ తల్లి లోహం కళావతిని ఎస్ఐ రమేష్ కుమార్ స్టేషన్కు పిలిపించాడు. కుమారుడి జాడ చెప్పాలంటూ ఎస్ఐ బూతులు తిట్టాడని కళావతి వాపోయింది. కాల్చి చంపి పేపర్ లో ఆ వార్త వేయిస్తానని బెదిరించాడని తెలిపింది.
Read also: Vinesh Phogat: కోర్టు తీర్పుపై వినేష్ ఫోగట్ పోస్ట్ వైరల్..
నరేష్ ఆచూకీ తెలిసే వరకు రోజూ స్టేషన్ కు రావాలని హుకుం జారీ చేశాడని చెప్పింది. దీంతో 3 నెలలుగా ఉదయం వచ్చి రాత్రి వరకూ రాణా లోనే కూర్చొని.. ఇంటికి పోతున్నానని వెల్లడించింది. కూలి పనులపై బతికే తాను రోజూ స్టేషన్కు వస్తుండటంతో పూట గడవడం కష్టంగా మారిందని వాపోయింది. ఎస్ఐ పలుమార్లు చేతులు, కాళ్లపై లాఠీతో కొట్టడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని కన్నీటి పర్యంతమైంది. కళావతి కన్నీటి గాధతో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టారు. దళిత మహిళా కళావతి పై దాడి చేసిన ఎస్ఐ రమేశ్తో పాటు సిబ్బంది పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
Read also: ఎర్ర చీరలో నిమ్మపండు లాంటి అందం.. జాన్వీ లుక్స్ అదుర్స్
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో పోలీసులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇన్స్పెక్టర్ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులపై కేసులు నమోదు చేశారు అధికారులు. ఇప్పటికే డిటెక్టివ్ సీఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన విషయం తెలసిందే.. ఇప్పుడు మరో దళిత మహిళపై ఎస్ఐ రమేష్ కుమార్ చిత్ర హింసలకు గురిచేశాడనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.
OTT Movies : థియేటర్లలో రిలీజ్ అయిన వారానికే ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమా..
తాజావార్తలు
-
UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
-
Stock Market: మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
-
Nithiin : నితిన్ – సితార ఎంటర్టైన్మెంట్స్ – డెబ్యూ డైరెక్టర్స్
-
Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
-
Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్గా ‘కేరళ’ కింగ్!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!