NTV Telugu Site icon

Hyderabad: గచ్చిబౌలి రెడ్స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య..

Murder

Murder

Hyderabad: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో గల రెడ్ స్టోన్ హోటల్ లో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతికి గురైంది. రేప్ అండ్ మర్డర్ చేసి ఆత్యహత్యగా చిత్రీకరిస్తున్నారనీ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి రెడ్ స్టోన్ హోటల్ లో ఇద్దరు అమ్మాయిలు రెండు గదులు తీసుకున్నారు. ఇవాళ (సోమవారం) ఉదయం ఓ గదిలో శృతి అనే నర్సింగ్ స్టూడెంట్ చనిపోయింది.

Read Also: Road Accident: బీఎండబ్ల్యూ బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడ్డ ఇద్దరు యువతులు!

అయితే, పోలీసులు శృతి మృతదేహాన్ని అంబులెన్స్ లోకి ఎక్కిస్తుండగా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. ఆ డెడ్ బాడీతో రెడ్ స్టోన్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. శృతిని రేప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి.. సమగ్ర దర్యాప్తుచేస్తామని పేర్కొన్నారు.