KTR Challenge: కేటీఆర్ సవాల్.. రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా..
- రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా రైతు రుణమాఫీ 100 శాతం పూర్తయిందని నిరూపించండి..
- స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్..
KTR Challenge: రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా రైతు రుణమాఫీ 100 శాతం పూర్తయిందని నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. కొండారెడ్డి పల్లి, పాలేరు నుంచి ఎక్కడికైనా వెళ్లాలని సవాల్ విసిరారు. ఇవాళ అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ జరిగింది. దీనిపై కేటీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రైతులను అడగాలని అన్నారు. 100 శాతం రుణమాఫీ చేశామని నిరూపించాలని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాలు తెచ్చుకోండి అని ఇదే రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని.. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రుణమాఫీకి రూ.49 వేల 500 కోట్లు అని చెప్పారు.
Read also: Harish Rao Vs Komatireddy: కాళేశ్వరం నీళ్లు ఒక్క ఎకరానికి ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా..
Also Read
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
- Telangana Fuel Supply : తెలంగాణలో ఇంధన సంక్షోభానికి సర్కార్ చెక్
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
మొన్న జరిగిన పాలమూరు విజయోత్సవ సభలో సీఎం రూ. 19 వేల కోట్లు. ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం.. ఈ రాష్ట్రంలోని ఏ పల్లెకైనా వెళ్దాం.. కొండారెడ్డిపల్లె, సిరిసిల్ల, పాలేరు.. ఎక్కడి వెళ్దాం మంటే అక్కడికి వెళ్దాం. ఏ గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ చేశామని నిరూపిస్తే వెంటనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఇలాంటి బుకాయింపులు, మోసం ప్రభుత్వానికి మంచిది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఎగ్గొట్టేందుకు యత్నిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రైతుల భరోసా బడ్జెట్లో 15 వేల కోట్లు కేటాయించారు. రూ. 70 లక్షల మంది రైతులకు 23 వేల కోట్లు కావాలి. రైతుబంధు కోత సిద్ధమైన తర్వాతే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం వేసి కాలయాపన చేస్తున్నారు. వర్షాకాలంలో రైతుబంధును నివారించినట్లే ఇప్పుడు కూడా రైతుబంధును తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేనిఫెస్టోలో కోతలను ఎందుకు ప్రస్తావించలేదు? ఈ రాష్ట్రంలో కోటికి పైగా పాన్ కార్డులు ఉన్నాయి. వీళ్లకు కట్ చేస్తామంటే ఎలా? ఐటీ కట్టే వాళ్లకు కట్ట్ చేస్తామంటే ఎలా ? రైతు బంధు పథకాన్ని ఉరి వేయబోతున్నారని మా అనుమానం అని కేటీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!