Lagacharla farmers: సంగారెడ్డి జైలు నుంచి విడుదలైన లగచర్ల రైతులు..
- సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన 17 మంది లగచర్ల రైతులు..
- జైలులోనే A2 సురేష్ తో సహా ఏడు మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lagacharla farmers: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంగారెడ్డి జైలులో 37 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న 17 మంది రైతులు ఈ ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు వారికి గిరిజన సంఘాలు, బీఆర్ ఎస్ నాయకులు స్వాగతం పలికారు. కాగా, ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నిందితులకు నాంపల్లి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా, రైతులు గురువారమే జైలు నుంచి విడుదల కావాల్సి ఉన్నా.. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా అందాయి.
Read also: Karnataka BJP MLC Arrest: మహిళా మంత్రిని దూషించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ అరెస్ట్..
Also Read
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
దీంతో ఈ ఉదయం రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు ఇదే కేసులో ఏ1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా మొత్తం 24 మందికి నాంపల్లి ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు నరేందర్ రెడ్డికి రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. 50,000 చొప్పున చెల్లించాలని, 3 నెలల పాటు వారానికి ఒకసారి బొంరాస్పేట ఎస్హెచ్ఓ ఎదుట హాజరుకావాలని, విచారణకు సహకరించాలన్నారు. అదేవిధంగా, అదే కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.లక్ష పూచీకత్తు ఇవ్వాలని షరతులు విధించింది. 20,000 మరియు ప్రతి వారం పోలీసుల ముందు హాజరు కావాలి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు భోగమోని సురేష్తోపాటు మరో ఏడుగురికి బెయిల్ లభించలేదు.
Read also: CM Revanth Reddy: సర్కార్ మెగా ప్లాన్.. హైదరాబాద్లో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీ ..
విడుదలైన రైతులు మాట్లాడుతూ..
మరోవైపు జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనతో అస్సలు మాకు సంబంధం లేదని లగచర్ల రైతులు తెలిపారు. అయినా మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని వాపోయారు.
కరెంట్ బంద్ చేసి అర్ధరాత్రి ఇండ్లలో నుంచి పోలీసులు తీసుకువెళ్లారని తెలిపారు. బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లేందుకు పాస్ పోర్ట్ అప్లై చేసుకుంటే ఈ కేసుతో క్యాన్సిల్ అయ్యిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రాణాలు పోయిన మా భూములు ఇవ్వమని, ఇండస్ట్రీ కారిడార్ కి కూడా భూములు ఇవ్వమని రైతులు తెలిపారు.
UiTheMovie : ‘యూఐ’ ప్రీమియర్ టాక్.. దటీజ్ ఉపేంద్ర
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!