KTR Tweet: మూసీ మురుగులో పొర్లుతూ అందరికీ బురదను అంటించాలని.. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
- కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై కేటీఆర్ మరో సారి ట్విటర్ వేదికగా ఫైర్..
- పాలన చేతకాక పనికిమాలిన మాటలు అంటూ ట్విటర్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సారి ట్విటర్ వేదికగా ఫైర్ అయ్యారు. మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్ తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాక పనికిమాలిన మాటలు.. .. పాగల్ పనులు. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని తెలిపారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్…. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు.
Read also: Thaman : వచ్చే ఏడాది సందడంతా తమన్ దే
Also Read
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
- Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
- CM Revanth Reddy : పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయం లో (పర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబర్వన్ అయిందని గుర్తు చేశారు. మూసీ ప్రాజెక్టులో 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం సాధించిందన్నారు. బిల్డర్లను, రియల్టర్లను బెదిరించకుండానే ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందన్నారు. మీ బడే భాయ్ మోడీ ITIR ని రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యకపోయినా, IT ఎగుమతులలో 2035 లో చేరుకోవాల్సిన టార్గెట్ ని పదకొండేళ్ల ముందే 2023 లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిది అని గుర్తు చేశారు. ఢిల్లీకి డబ్బు సంచులు పంపకుండానే తెలంగాణ విత్తన భాండాగారమైందని, దేశంలోనే ధాన్యరాశిగా మారిందన్నారు.
Read also: IMD Weather: వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..
పేదల కంట కన్నీరు లేకుండానే పారిస్, బొగొటా, మెక్సికో సిటీ, మోంటేరియల్ లను అధిగమించి ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ సిటీ అవార్డును హైదరాబాద్ దక్కించుకుందని గుర్తుచేశారు. మూసీ నదికి అటుఇటు అభివృద్ధి, ఆకాశ హర్మ్యాలు కడుతున్నప్పుడు మరి ఫోర్త్ సిటీ ఎందుకు? మూసీ పక్కన పెట్టుబడి పెట్టేందుకు ఫోర్ బ్రదర్స్ మనీ స్పిన్నింగ్ కోసమా? ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు ? అంటూ ప్రశ్నించారు. ఎత్తైన కుర్చీలో కూర్చుంటేనో.. సమావేశాల్లో తల కిందకి, మీదకి తిప్పితేనో అభివృద్ధి జరగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అంటూ ప్రభుత్వ బడి పిల్లల ఇజ్జత్ తీయకు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుతమైన ఇంగ్లిష్ మాట్లాడతారు. ప్రపంచవ్యప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారని ట్విటర్ వేదికగా తెలిపారు.
పాలన చేతకాక పనికిమాలిన మాటలు.. .. పాగల్ పనులు. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్…. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుంది…
— KTR (@KTRBRS) October 18, 2024
Allagadda Politics: నేతల మధ్య మాటల యుద్ధం.. ఆళ్లగడ్డలో హైటెన్షన్..!
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!