Komatireddy Venkat Reddy: తెలంగాణలో టీఆర్ఎస్ లేదు.. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయింది..
- ఈడి ఆఫీస్ ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా..
- పెద్ద ఎత్తున పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ ముంన్షి- కాంగ్రెస్ మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: తెలంగాణలో టీఆర్ఎస్ లేదు.. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడి ఆఫీస్ ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. గన్ పార్క్ నుండి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ ముంన్షి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కోమటి రెడ్డి మాట్లాడుతూ.. ఆధాని మెగా కుంభకోణం పై విచారణ జరపాలన్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని తెలిపారు. దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టామన్నారు. మోడీ నల్లధనం తెస్తానని.. పేదల ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని 15 పైసలు కూడా వేయలేదన్నారు.
Read also: Sandra Venkata Veeraiah: కీర్తి వస్తే వాళ్ళది.. అపకీర్తి వస్తే మాదా? సండ్ర సీరియస్
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
అదానీ మాత్రం ప్రపంచంలోనే ధనవంతులు జాబితాలో చేర్చాడు మోడీ అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పనిచేద్దాం.. లేదంటే మోడీ ఈ దేశాన్ని నలుగురి చేతిలో పెట్టి నాశనం చేస్తారన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయన్నారు. లేదంటే 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచేదన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ లేదన్నారు. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందన్నారు. మన పోరాటం బీజేపీ తోటే అన్నారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సెబీ చైర్మన్ ని వెంటనే విధుల నుంచి తప్పించాలన్నారు. అదానీ ఆస్తులు అక్రమంగా పెంచడంపై న్యాయవిచారణ జరగాలన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీ తో విచారణ జరిపించాలన్నారు. మోడీని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్లపై ఈడి దాడులు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కానీ ఆదాని అక్రమాస్తులపై ఎందుకు విచారణ జరగడం లేదన్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!