Kishan Reddy: హైదరాబాద్ లో ఇది నాలుగో సంఘటన.. అయినా స్పందించరా..
- హైదరాబాద్ లో హిందూ దేవాలయ వరుసగా దాడులు..
- ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం..
- నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: హైదరాబాద్ లో వరుసగా హిందూ దేవాలయాల విధ్వంసం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది నాలుగో సంఘటన.. అయినా స్పందించరా.. అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో హిందూ దేవాలయ వరుసగా దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మతోన్మాద శక్తులు దాడికి పాల్పడి మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కొన్ని రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో ఇది నాలుగో సంఘటన జరగడం బాధాకరం అన్నారు. హిందూ దేవాలయాలపై విగ్రహాలపై దాడి చేసిన వారు దొంగతనాలు చేయడానికి వచ్చారని అన్నారు.
మరికొంతమంది మతిస్థిమితం లేకుండా దాడులు చేస్తున్నారని పోలీసులు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. నగరంలో హిందు పండుగలు జరుపుతున్న వేళ రాత్రి పది దాటిన తర్వాత డీజేలు సౌండ్ సిస్టం పెడితే పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న వారు ఇలాంటి సంఘటనలు జరిగితే ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా అరెస్టు చేసి వారి వెనుక ఎవరెవరి హస్తము ఉన్నాదో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
Read also: Minister Seethakka: దివ్యాంగులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. మెసేజ్ చేస్తే చాలు..
దుర్గమ్మ నవరాత్రి పూజల సందర్భంగా పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటుచేసుకుందన్నారు. దుండగులు దుర్గామాత ఆలయాన్ని చోరీ చేసేందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్కు రాలేదని, విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చారని తెలిపారు. రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సికింద్రాబాద్లో ఉన్న ముత్యాలమ్మ విగ్రహాన్ని తరలించారని కిషన్రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రాత్రి వేళల్లో ఆలయాల వద్ద పోలీసుల పర్యవేక్షణ ఉండాలని కిషన్ రెడ్డి కోరారు. కాగా, సికింద్రాబాద్లోని కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని రాత్రి సమయంలో దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం పగులగొట్టిన శబ్దం వినిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఒక దుండగుడు పట్టుబడ్డాడు. మరో వ్యక్తి పారిపోయాడు. ఈ ఘటనపై హిందూ సంఘాలతోపాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Telangana Liquor Sales: మనోళ్లు మామూలోళ్లు కాదు.. వెయ్యి కోట్ల మందు తాగేశారు..
తాజావార్తలు
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!