Banjara Hills Crime: జువెలరీ షాప్ లో రూ.6 కోట్ల ఆభరణాలు మాయం కేసులో ట్విస్ట్..
- బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ లో రూ.6 కోట్ల అభరణాలు మాయం..
- కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banjara Hills Crime: రూ.6 కోట్ల ఆభరణాలు మామైన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ షాప్ లో కలకలం రేపుతుంది. షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ షాప్ కు చెందిన యజమాని రోజూ లాగానే షాప్ కి వచ్చాడు. అయితే షాప్ తెరవగానే లోపల చిందర వందరగా ఉండటంతో యజమానికి అనుమానం వచ్చింది. షాప్ లో రూ.6 కోట్ల అభరణాలు చోరీ అయినట్లు గమనించాడు. దీంతో యజమాని వెంటనే మేనేజర్ సుకేతుషాకి కాల్ చేశాడు. సుకేతుషా ఫోన్ స్వీచ్ ఆఫ్ వచ్చింది. కాగా సుకేతుషాపై అనుమానం రావడంతో జూవెలరీ షాప్ యజమాని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు, జూవెలర్స్ షాప్ యజమానికి అక్కడ వున్న ఆభరాణాల వివరాలను సేకరించారు. ఆభరణాలు మాయం అయినప్పటి నుంచి ఎవరెవరు షాప్ కు రాలేదని పోలీసులు ఆరా తీయగా సుకేతు షా అప్పటి నుంచి కనిపించకుండా పోయాడని, అతని ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ ఉందని తెలిపారు. పోలీసులకు సుకేతు షాపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుకేతుషాపై కేసు నమోదు చేశారు. సుకేతుషా కు షాప్ లో వున్న వారే సహకరించారని అనుమానిస్తున్నారు. అతనొక్కడే రూ.6 కోట్ల అభరణాలు మాయాం చేసేంత లేదని తెలిపారు. మేనేజర్ సుకేతు షా తో పాటు ఉదయ్ కుమార్, చింటు, సత్య, అజయ్, టింకు, చంద్ర, శ్రీకాంత్ బబ్బూరి లపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు. పరారీలో లో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కేసులో ట్విస్ట్..
అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన భర్త కనిపించడం లేదంటూ మేనేజర్ సుకేతు షా భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే తన భర్త అదృశ్యం అయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. వేధిస్తున్నారని లెటర్, ఒక వీడియో ఉందని ఫిర్యాదులో భార్య పేర్కొంది. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఒక వైపు షాప్ లో రూ.6 కోట్ల అభరణాలు చోరీ జరిగినప్పటి నుంచి మేనేజర్ కనిపించకుండా పోవడంతో అతనిపై అనుమానం వ్యక్తం చేసి కేసు నమోదు చేసిన పోలీసులకు సుకేతు భార్య ఫిర్యాదు చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అటు యజమాని, ఇటు పరారీలో వున్న సుకేతు భార్య ఫిర్యాదులను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Onion Peel: చెత్త బుట్టలో పడేసే ఉల్లి పొట్టుతో పుట్టెడు లాభాలు
తాజావార్తలు
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!