Banjara Hills Crime: జువెలరీ షాప్ లో రూ.6 కోట్ల ఆభరణాలు మాయం కేసులో ట్విస్ట్..
- బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ లో రూ.6 కోట్ల అభరణాలు మాయం..
- కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banjara Hills Crime: రూ.6 కోట్ల ఆభరణాలు మామైన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ షాప్ లో కలకలం రేపుతుంది. షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
- Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
- Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ షాప్ కు చెందిన యజమాని రోజూ లాగానే షాప్ కి వచ్చాడు. అయితే షాప్ తెరవగానే లోపల చిందర వందరగా ఉండటంతో యజమానికి అనుమానం వచ్చింది. షాప్ లో రూ.6 కోట్ల అభరణాలు చోరీ అయినట్లు గమనించాడు. దీంతో యజమాని వెంటనే మేనేజర్ సుకేతుషాకి కాల్ చేశాడు. సుకేతుషా ఫోన్ స్వీచ్ ఆఫ్ వచ్చింది. కాగా సుకేతుషాపై అనుమానం రావడంతో జూవెలరీ షాప్ యజమాని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు, జూవెలర్స్ షాప్ యజమానికి అక్కడ వున్న ఆభరాణాల వివరాలను సేకరించారు. ఆభరణాలు మాయం అయినప్పటి నుంచి ఎవరెవరు షాప్ కు రాలేదని పోలీసులు ఆరా తీయగా సుకేతు షా అప్పటి నుంచి కనిపించకుండా పోయాడని, అతని ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ ఉందని తెలిపారు. పోలీసులకు సుకేతు షాపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుకేతుషాపై కేసు నమోదు చేశారు. సుకేతుషా కు షాప్ లో వున్న వారే సహకరించారని అనుమానిస్తున్నారు. అతనొక్కడే రూ.6 కోట్ల అభరణాలు మాయాం చేసేంత లేదని తెలిపారు. మేనేజర్ సుకేతు షా తో పాటు ఉదయ్ కుమార్, చింటు, సత్య, అజయ్, టింకు, చంద్ర, శ్రీకాంత్ బబ్బూరి లపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు. పరారీలో లో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కేసులో ట్విస్ట్..
అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన భర్త కనిపించడం లేదంటూ మేనేజర్ సుకేతు షా భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే తన భర్త అదృశ్యం అయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. వేధిస్తున్నారని లెటర్, ఒక వీడియో ఉందని ఫిర్యాదులో భార్య పేర్కొంది. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఒక వైపు షాప్ లో రూ.6 కోట్ల అభరణాలు చోరీ జరిగినప్పటి నుంచి మేనేజర్ కనిపించకుండా పోవడంతో అతనిపై అనుమానం వ్యక్తం చేసి కేసు నమోదు చేసిన పోలీసులకు సుకేతు భార్య ఫిర్యాదు చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అటు యజమాని, ఇటు పరారీలో వున్న సుకేతు భార్య ఫిర్యాదులను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Onion Peel: చెత్త బుట్టలో పడేసే ఉల్లి పొట్టుతో పుట్టెడు లాభాలు
తాజావార్తలు
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!