Banjara Hills Crime: జువెలరీ షాప్ లో రూ.6 కోట్ల ఆభరణాలు మాయం కేసులో ట్విస్ట్..
- బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ లో రూ.6 కోట్ల అభరణాలు మాయం..
- కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banjara Hills Crime: రూ.6 కోట్ల ఆభరణాలు మామైన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ షాప్ లో కలకలం రేపుతుంది. షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
- CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ షాప్ కు చెందిన యజమాని రోజూ లాగానే షాప్ కి వచ్చాడు. అయితే షాప్ తెరవగానే లోపల చిందర వందరగా ఉండటంతో యజమానికి అనుమానం వచ్చింది. షాప్ లో రూ.6 కోట్ల అభరణాలు చోరీ అయినట్లు గమనించాడు. దీంతో యజమాని వెంటనే మేనేజర్ సుకేతుషాకి కాల్ చేశాడు. సుకేతుషా ఫోన్ స్వీచ్ ఆఫ్ వచ్చింది. కాగా సుకేతుషాపై అనుమానం రావడంతో జూవెలరీ షాప్ యజమాని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు, జూవెలర్స్ షాప్ యజమానికి అక్కడ వున్న ఆభరాణాల వివరాలను సేకరించారు. ఆభరణాలు మాయం అయినప్పటి నుంచి ఎవరెవరు షాప్ కు రాలేదని పోలీసులు ఆరా తీయగా సుకేతు షా అప్పటి నుంచి కనిపించకుండా పోయాడని, అతని ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ ఉందని తెలిపారు. పోలీసులకు సుకేతు షాపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుకేతుషాపై కేసు నమోదు చేశారు. సుకేతుషా కు షాప్ లో వున్న వారే సహకరించారని అనుమానిస్తున్నారు. అతనొక్కడే రూ.6 కోట్ల అభరణాలు మాయాం చేసేంత లేదని తెలిపారు. మేనేజర్ సుకేతు షా తో పాటు ఉదయ్ కుమార్, చింటు, సత్య, అజయ్, టింకు, చంద్ర, శ్రీకాంత్ బబ్బూరి లపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు. పరారీలో లో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కేసులో ట్విస్ట్..
అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన భర్త కనిపించడం లేదంటూ మేనేజర్ సుకేతు షా భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే తన భర్త అదృశ్యం అయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. వేధిస్తున్నారని లెటర్, ఒక వీడియో ఉందని ఫిర్యాదులో భార్య పేర్కొంది. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఒక వైపు షాప్ లో రూ.6 కోట్ల అభరణాలు చోరీ జరిగినప్పటి నుంచి మేనేజర్ కనిపించకుండా పోవడంతో అతనిపై అనుమానం వ్యక్తం చేసి కేసు నమోదు చేసిన పోలీసులకు సుకేతు భార్య ఫిర్యాదు చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అటు యజమాని, ఇటు పరారీలో వున్న సుకేతు భార్య ఫిర్యాదులను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Onion Peel: చెత్త బుట్టలో పడేసే ఉల్లి పొట్టుతో పుట్టెడు లాభాలు
తాజావార్తలు
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!