Hyderabad: సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఫంగస్ వచ్చిన అల్లంతో వంటకాలు..
- హైదరాబాద్ లో నిరంతరం కొనసాగుతున్న ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు..
- ఇవాళ నగరంలోని సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ లో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ నగరంలోని సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. శ్రీ రాఘవేంద్ర, ఉడిపి, సంతోష్ హోటల్స్ లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించట్లేదన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్స్ కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. హోటల్స్ లో ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఇంగ్రిడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు షాక్ తిన్నారు.
Read also: TGSRTC Tour Package: అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
అంతేకాకుండా.. హోటల్స్ లో కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నట్లు గుర్తించారు. ఫంగస్ వచ్చిన అల్లం స్టోర్ రూమ్ లో గుర్తించారు. దీనితో వంటకాలు చేస్తున్నట్లు తెలిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని హోటల్ యాజమాన్యంపై మండిపడ్డారు. హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హోటల్ ను సీజ్ ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఫుడ్ సెఫ్టీ లేకుండా ఇలాంటి ఆహారం ప్రజలకు పెడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి ఆహారం తినే భోజన ప్రియులు అనారోగ్యానికి గురి అవుతున్నారని తెలిపారు. పలు హోటళ్లపై చర్యలు తీసుకుంటున్నా కొందరు హాటల్ యాజమాన్యం తీరు మాత్రం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Caste Census Survey: తెలంగాణలో రెండో రోజు సమగ్ర కుటుంబ సర్వే.. ఎల్లుండి నుంచి వివరాల నమోదు..
మరోవైపు ముసాపేట్ కృతుంగ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. రెస్టారెంట్.. ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఇంగ్రిడియంట్స్ వాడుతున్నట్లు తెలిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని మండిపడ్డారు. కృతుంగ రెస్టారెంట్ పై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్ నైన్ రెస్టారెంట్ లో కూడా ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల గ్రిల్ నైన్ రెస్టారెంట్ లో చికెన్ కర్రీతో భోజనం చేసిన బైగా అనే యువతి ఫుడ్ పాయిజన్ తో మృతి చెందింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఇవాళ రెస్టారెంట్ పై తనిఖీలు నిర్వహించారు.
Sai Durga Tej : పక్కా ప్లానింగుతో ప్యామిలీ ప్యాక్ లేపేసిన మెగా హీరో
తాజావార్తలు
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!