Hyderabad: సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఫంగస్ వచ్చిన అల్లంతో వంటకాలు..
- హైదరాబాద్ లో నిరంతరం కొనసాగుతున్న ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు..
- ఇవాళ నగరంలోని సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ లో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ నగరంలోని సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. శ్రీ రాఘవేంద్ర, ఉడిపి, సంతోష్ హోటల్స్ లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించట్లేదన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్స్ కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. హోటల్స్ లో ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఇంగ్రిడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు షాక్ తిన్నారు.
Read also: TGSRTC Tour Package: అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
Also Read
అంతేకాకుండా.. హోటల్స్ లో కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నట్లు గుర్తించారు. ఫంగస్ వచ్చిన అల్లం స్టోర్ రూమ్ లో గుర్తించారు. దీనితో వంటకాలు చేస్తున్నట్లు తెలిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని హోటల్ యాజమాన్యంపై మండిపడ్డారు. హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హోటల్ ను సీజ్ ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఫుడ్ సెఫ్టీ లేకుండా ఇలాంటి ఆహారం ప్రజలకు పెడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి ఆహారం తినే భోజన ప్రియులు అనారోగ్యానికి గురి అవుతున్నారని తెలిపారు. పలు హోటళ్లపై చర్యలు తీసుకుంటున్నా కొందరు హాటల్ యాజమాన్యం తీరు మాత్రం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Caste Census Survey: తెలంగాణలో రెండో రోజు సమగ్ర కుటుంబ సర్వే.. ఎల్లుండి నుంచి వివరాల నమోదు..
మరోవైపు ముసాపేట్ కృతుంగ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. రెస్టారెంట్.. ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఇంగ్రిడియంట్స్ వాడుతున్నట్లు తెలిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని మండిపడ్డారు. కృతుంగ రెస్టారెంట్ పై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్ నైన్ రెస్టారెంట్ లో కూడా ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల గ్రిల్ నైన్ రెస్టారెంట్ లో చికెన్ కర్రీతో భోజనం చేసిన బైగా అనే యువతి ఫుడ్ పాయిజన్ తో మృతి చెందింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఇవాళ రెస్టారెంట్ పై తనిఖీలు నిర్వహించారు.
Sai Durga Tej : పక్కా ప్లానింగుతో ప్యామిలీ ప్యాక్ లేపేసిన మెగా హీరో
తాజావార్తలు
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?