CM Revanth Shake Hands KCR: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు (డిసెంబర్ 29న) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభాహాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మిగతా సభ్యుల కంటే ముందుగానే మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ సభా లోపలికి చేరుకుని తన సీటులో కూర్చున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలోకి రాగానే కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు.
Read Also: Bumrah-Hardik: బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ.. టీ20 ప్రపంచకప్పై ఫోకస్..?
అయితే, సభ ప్రారంభమైన వెంటనే కేసీఆర్ కొద్దిసేపు మాత్రమే అసెంబ్లీ హాల్లో ఉన్నారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి సభ నుంచి బయటికొచ్చి నంది నగర్లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇక, అంతకుముందు కేసీఆర్ అసెంబ్లీకి చేరుకుని శాసన సభ రిజిస్ట్రర్ లో సంతకం చేశారు.
