Kukatpally Sahasra Case: 5 రోజులు సమయం ఎందుకు పట్టింది? ఓ పిల్లోడు ఏం క్లూ ఇచ్చాడంటే.. !
- క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి సహస్రను చంపేశాడు
- ఓ పిల్లోడు ఇచ్చిన క్లూతో నిందితుడు దొరికాడు
- సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్పల్లి సహ్రస హత్య కేసు మిస్టరీ వీడింది. హత్య కేసు మిస్టరీని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. సహస్రను చంపింది పక్కింటి పదో తరగతి బాలుడు అని తెలిపారు. సహస్ర హత్యకు గురైన రోజే తమకు అనుమానం వచ్చి బాలుడిని విచారించామని.. కానీ తనకేమీ తెలియదని అబద్ధం చెప్పాడన్నారు. నాలుగు రోజుల పాటు అనేక మందిని విచారించామని.. అయితే ఓ పిల్లోడు క్లూ ఇచ్చాడని.. హత్య జరిగిన రోజు ఆగస్టు 18న ఉదయం 8:30-8:40 గంటల సమయంలో సహస్ర ఇంటి సమీపంలో నిందితుడు తచ్చాడుతూ కనిపించినట్లుగా పిల్లోడు సమాచారం ఇచ్చాడని.. దీంతో తమ అనుమానం బలపడిందన్నారు. అనంతరం బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడని చెప్పుకొచ్చారు.
గత ఐదేళ్ల నుంచి నిందితుడు సరిగ్గా స్కూల్కు వెళ్లడం లేదని.. ఓటీటీలో క్రైమ్ సినిమాలు, మిస్టరీ సీన్లు చూడ్డాం. యూట్యూబ్లో క్రైమ్ థిల్లర్ మూవీలు చూడ్డాం అలవాటు చేసుకున్నాడని.. ఎప్పుడూ స్కూల్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడుతుంటాడని తెలిపారు. హత్య జరిగిన రోజు నిందితుడి ఇంట్లో తల్లి తప్పు అందరూ ఉన్నారని.. అదే రోజు తల్లి అడిగితే తనకేమీ తెలియదని అబద్ధం చెప్పాడన్నారు. చివరికి తనకేమీ తెలియదని ఒట్టు కూడా వేశాడని ఆమె తెలియజేసినట్లుగా పేర్కొన్నారు. అయితే రెండు నెలల క్రితం చేతిలో మొబైల్ చూసి.. ఇదెక్కడిది అని అడిగితే సమాధానం ఇవ్వలేదని తల్లి చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు.
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ఇక హత్య చేసిన తర్వాత ఇంటి బయట కత్తి కడిగి.. లోపలికి వెళ్లి ప్యాంట్, టీ షర్ట్తోనే స్నానం చేసి అనంతరం ఆ బట్టలను వాషింగ్ మిషన్లో వేసేశాడని వివరించారు. అయితే తమకు అనుమానం ఇచ్చి నిందితుడి ఇల్లు తనిఖీ చేయగా ఒక లెటర్ దొరికిందని.. అది ఈ హత్య కోసం కాదని చెప్పారు. ఇక అదే రోజు కుందేల్ కూడా చనిపోయిందని.. దాని స్టోరీ కూడా తమకు చెప్పాడని పేర్కొన్నారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా కుందేల్ బతకలేదని చెప్పినట్లుగా తెలిపారు. కేవలం సహస్ర తమ్ముడి బ్యాట్ నచ్చడంతో.. దాన్ని దొంగిలించాలని స్కెచ్ వేశాడని.. చోరీ చేస్తుండగా సహస్ర చూడడంతో చంపేశాడని పోలీసులు వివరించారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!