CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి.. క్యాబినెట్ విస్తరణపై హై కమాండ్తో భేటీ..
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ పై చర్చ ..
- ఈసారి మంత్రివర్గ విస్తరణ పై ఢిల్లీ టూర్ లో క్లారిటీ వస్తుందంటున్న కాంగ్రెస్ నేతలు..
- ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన ఆశావాహులు..
- ఇప్పటికే అధిష్టాన పెద్దలకు లేఖ రాసిన మల్ రెడ్డి రంగారెడ్డి..
CM Revanth Reddy: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండోరోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు పార్లమెంట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం అనంతరం పార్లమెంట్ లోనే రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో, మంత్రివర్గ విస్తరణ పై చర్చకు వచ్చే అవకాశం ఉందిని తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణ పై ఢిల్లీ టూర్ లో క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. విస్తరణపై ఇప్పటికే ఆశావాహులు ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. ఢిల్లీ టూర్ లో క్యాబినెట్ విస్తరణ పై హై కమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ భేటి ఉండే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో సీఎం సహా 11 మంది మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ విస్తరణ ఉంటే మరో ఆరుగురికి చోటు దక్కే ఛాన్స్ ఉంటుంది.
Read also: Bhoodan Land Scam: భూదాన్ భూముల స్కామ్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు..
Also Read
- Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
తెలంగాణలో ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్. ఇక క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఉంటుందా? అనే దానిపై ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. కేబినెట్లో చోటు కోసం నేతలు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలతో పాటూ, రాష్ట్రంలోని ముఖ్యనేతలను కలిసి మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నట్లు సమాచారం.
ఆశావాహాల్లో ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మదన్మోహన్రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ లు ఉన్నారు. క్యాబినెట్ విస్తరణ ఉంటే, ప్రాతినిధ్యం లేని జిల్లాలకు కచ్చితంగా అవకాశం ఉంటుందంటూ టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అధిష్టాన పెద్దలకు మల్ రెడ్డి రంగారెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్, రంగారెడ్డిలో తాను ఒక్కడినే గెలిచానంటూ, క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలని మల్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
Uttam Kumar Reddy: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన..
తాజావార్తలు
-
Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
-
Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..
-
USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
-
IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
-
Easy Mango Lassi Recipe: క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ.. ఒక్క గ్లాస్తో ఆగరు అంతే..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!