CM Revanth Reddy: సీతారామ ప్రాజెక్టు ప్రారంభం.. గోదావరి జలాలకు సీఎం ప్రత్యేక పూజలు..
- సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది..
- పంప్హౌస్-2ను సీఎం రేవంత్రెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు..
- ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలకు అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్, రాజీవ్ కెనాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో పంప్హౌస్-2ను సీఎం రేవంత్రెడ్డి స్విచ్ ఆన్ చేసి గోదావరి నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కంకుమ, పట్టువస్త్రాలు వదిలారు. కాగా, ఈ పథకం కింద దాదాపు 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అక్కడి నుంచి అనంతరం వైరాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. అదేవిధంగా ములకపల్లి మండలం కమలాపురం 3వ పంప్ హౌస్-3ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. మరోవైపు అశ్వాపురం మండలం కొత్తూరులో సీతారామ పంప్ హౌస్-1ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
Read also: Independence Day: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈరోజు రుణమాఫీ ఫైనల్ ఫేజ్ ప్రారంభించిన అనంతరం రాత్రికి హస్తినకు బయలుదేరి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే రెండు మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్ కాన్, యాపిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. మరోవైపు శుక్రవారం కాంగ్రెస్ హైకమాండ్తో రేవంత్ భేటీ కానున్నారు. ఆగస్టు 15న రైతుల రుణమాఫీ పూర్తయిన తర్వాత వరంగల్లో నిర్వహించనున్న రైతు కృతజ్ఞతా సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆహ్వానించనున్నారు.అదే విధంగా సచివాలయం ముందు రాజీవ్గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియాను రేవంత్ ఆహ్వానించనున్నారు.తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్పై ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Minister Seethakka: మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే.. రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది..
తాజావార్తలు
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!